బుల్లితెరపై ఎనలేని కామెడీని అందిస్తున్న వినోద కార్యక్రమాలు జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్. ఈ షోలతోనే అనేక మంది ఫేమ్ తెచ్చుకున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఆర్థికంగా కూడా బలపడ్డారు. అటువంటి వారిలో బుల్లెట్ భాస్కర్ ఒకరు.
బుల్లితెరపై ఎనలేని కామెడీని అందిస్తున్న వినోద కార్యక్రమాలు జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ . ప్రముఖ టెలివిజన్ సంస్థలో గురు, శుక్రవారాల్లో ప్రసారమై ఇంటిల్లి పాదిని అలరిస్తూనే ఉన్నాయి. కొన్నేళ్ల నుండి నిర్విరామంగా కొనసాగుతున్నాయి ఈ షోలు. ఈ షోలతోనే అనేక మంది ఫేమ్ తెచ్చుకున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఆర్థికంగా కూడా బలపడ్డారు. అటువంటి వారిలో బుల్లెట్ భాస్కర్ ఒకరు. అతడిలో చాలా టాలెంట్ ఉంది. రేడియో జాకీగా చేసిన ఆయన.. మహేష్ బాబు, ప్రముఖుల వాయిస్లను మిమిక్రీ చేస్తుంటారు. రాఘవ, చంటి టీమ్లో స్రిప్టు రైటర్, కంటెస్టుగా వచ్చి టీమ్ లీడర్గా ఎదిగాడు. అనేక మందికి అతడు కూడా లైఫ్ ఇచ్చాడు. మంచి పేరు తెచ్చుకున్నాడు
అయితే ఇటీవల విడుదలైన ప్రోమోతో బుల్లెట్ భాస్కర్ పై విమర్శలు మొదలయ్యాయి. వైసీపీ శ్రేణులు అతడిని టార్గెట్ చేస్తున్నాయి. ఈ నెల 7వ తేదీన ప్రసారమయ్యే ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా పంచ్ డైలాగులు ఉన్నాయి. ఇంతకు ఆ ప్రోమోలో ఏముందంటే.. భాస్కర్ టీంలో నరేష్తో పాటు అతడి తల్లిదండ్రులు కూడా నటించారు. స్కిట్టులో భాగంగా ఓ నటి ‘బావగారూ సినిమాకు తీసుకెళతారా’ అని భాస్కర్ తండ్రిని అడగ్గా.. సెకండ్ షోకు వెళ్లకమ్మా. ఆయనకు రే చీకటి అంటూ తల్లి కౌంటరిచ్చింది. ఆయనకు నెల ఇన్ కమ్ ఎంత వస్తుందమ్మా అని అడగ్గానే.. రూ. 2750 వస్తుందమ్మా అని చెబుతుంది భాస్కర్ తల్లి. అదేంటీ మరేమీ పెరగదా ‘మరేమీ పెరగదు. గవర్నమెంట్ మారితే పెరుగుతుంది’అని తల్లి డైలాగ్ వేశారు.
ఇదే డైలాగ్ వైసీపీ నేతలు, కార్యకర్తలను మంట రేపుతుంది. దీంతో బుల్లెట్ భాస్కర్ పై జగన్ ఫ్యాన్స్ తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఏపీలో వృద్ధాప్య ఫించను కింద రూ. 2750 ఇస్తున్నారు. దీన్ని ఉద్దేశించి ఆ డైలాగులు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా తన స్కిట్లకు తానే డైలాగ్స్ రాస్తుంటారు బుల్లెట్ భాస్కర్. ఇలా స్కిట్లు పేరుతో ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని హెచ్చరిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎంత పెన్షన్ ఉంది, ఇప్పుడు ఎంత వస్తుందో తెలుసుకుని మాట్లాడాలని కామెంట్లు పెడుతున్నారు. రాజకీయ విమర్శలు చేయాలనుకుంటే.. రాజకీయ వేదికలపై చేయాలి కానీ.. ఇలా కళామ్మ తల్లి వేదికపై చేయడం సరైనది కాదని చెబుతున్నారు. అలాగే ఈ ప్రోగ్రామ్ యాజమాన్యంపై కూడా మండిపడుతున్నారు. దీంతో బుల్లెట్ భాస్కర్ వివరణ ఇచ్చారు. తన తల్లి తరుపున క్షమాపణలు చెప్పారు. కార్యక్రమం నుండి ఆ డైలాగులు తొలగిస్తున్నట్లు చెప్పారు.