టెస్లా కంపెనీ అదినేత ఎలాన్ మస్క్.. ట్విట్టర్ని కొన్న సంగతి తెలిసిందే. నాటి నుంచి ఆయన రోజుకోక షాక్ ఇస్తూ వస్తున్నాడు. ట్విట్టర్ని స్వాధీనం చేసుకున్న తర్వాత.. బ్లూటిక్ పెయిడ్ వర్షన్ విధానాన్ని తీసుకువచ్చాడు మస్క్. అనగా.. బ్లూటిక్ సదుపాయం కొనసాగించాలంటే.. నెలకు కొంత మొత్తాన్ని చెల్లించాలని సూచించాడు. ఆ తర్వాత ట్విట్టర్ వాడే ప్రతి ఒక్కరు కూడా డబ్బులు చెల్లించేలా త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేయబోతున్నాడు అంటూ ప్రచారం సాగుతోంది. అంతేకాక మస్క్.. ట్విట్టర్ను స్వాధీనం చేసుకోగానే.. ముందుగా ఉన్నత పదవిలో ఉన్నా ఇద్దరు భారతీయులను తొలగించాడు. మరో సగం మంది ఉద్యోగులను తొలగించబోతున్నాడు అంటూ వార్తలు ప్రచారం అయ్యాయి.
ఇవన్ని ఎలా ఉన్నా.. మస్క్ తీసుకొచ్చిన బ్లూటిక్ పెయిడ్ వర్షన్ వల్ల.. ఒకపార్మ కంపెనీ.. లక్షల కోట్ల రూపాయలు నష్ట పోయింది. నకిలీ ఖాతాతో పెట్టిన.. ఓ తప్పుడు సందేశం వల్ల సదరు అమెరికన్ దిగ్గజ ఫార్మ కంపెనీ ఏకంగా 1.22లక్షల కోట్లు ఆవిరయ్యేలా చేసింది. ఇంతకీ ఆ అసత్య ప్రచారం ఏమిటీ.. అంత భారీ స్థాయిలో.. ఫార్మా సంస్థ ఎందుకు నష్టం పోయింది.. వంటి వివరాలు ఇక్కడ చూడండి.
ఇంతకు సదరు ఫార్మా కంపెనీ ఏది అంటే.. ఇలయ్ లిల్లి అండ్ కంపెనీ. ఈ ఫార్మ కంపెనీ డయాబెటిక్ రోగులకు అవసరమైన ఇన్సులిన్ వంటి ఉత్పత్తులను తయారు చేస్తుంది. అయితే ఆ సంస్థ పేరు మీద కొందరు నకిలీ ట్విట్టర్ ఎకౌంట్ ఒపెన్ చేశారు. ఎనిమిది డాలర్లు చెల్లింటి బ్లూటిక్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఇక మీదట ఇలయ్ లిల్లి కంపెనీ అందరికి ఉచితంగా ఇన్సులిన్ ఇస్తుంది అంటూ తప్పుడు సమాచారాన్ని.. సదరు కంపెనీ ప్రకటించినట్లుగా ట్వీట్ చేశారు. దాంతో నిమిషాల వ్యవధిలోనే ఈ ట్వీట్ వైరలయ్యింది.
ఈ ట్వీట్తో సంస్థ షేర్ల ధర.. ఒక్కసారిగా 4.37శాతం మేర పడిపోయింది. ఫలితంగా కంపెనీకి ఏకంగా 1.22 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. ఆ తర్వాత విషయం తెలుసుకున్న ఇలయ్ లిల్లి కంపెనీ.. ఆ ట్వీట్తో తమకు సంబంధం లేదని.. ఎవరో కావాలనే ఇలా తప్పుడు సమాచారం ట్వీట్ చేశారని.. ఇందకు క్షమించాల్సిందిగా ప్రజలను కోరారు. గతంలో సినీ, రాజకీయ ఇలా వేర్వేరు రంగాలకు చెందిన సెలబ్రిటీల ఖాతాలను పరిశీలించిన తర్వాత మాత్రమే బ్లూటిక్ సదుపాయం కల్పించేవారు. కానీ ప్రస్తుతం మస్క్ తీసుకువచ్చిన పెయిడ్ వర్షన్ కారణంగా.. 8 డాలర్లు చెల్లించే వారికి బ్లూటిక్ సదుపాయం కల్పిస్తున్నారు. దీన్ని కొందరు ఇలా తప్పుడు పనులకు వినియోగించడం వల్ల ఎంతటి నష్టం కలుగుతుందో.. ఈ ఒక్క సంఘటనతో వెలుగులోకి వచ్చింది అంటున్నారు. మరి మస్క్ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటాడో చూడాలి.