ప్రముఖ ఫార్మాసూటికల్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ బేబీ పౌడర్పై నమోదైన వేలాది దావాలను పరిష్కరించాలని ఫిక్స్ అయింది. ఈ క్రమంలో కస్టమర్లకు రూ.వందల కోట్ల పరిహారం చెల్లించేందుకు సంస్థ రెడీ అయింది.
ఈ మధ్యకాలంలో తరచుగా అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవలే సికింద్రాబాద్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటన అందరికి తెలిసిందే. ఆ విషాద ఘటన మరువక ముందే తాజాగా హైదరాబాద్ లో మరో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
తెలంగాణలో వరుసగా అగ్ని ప్రమాద ఘటనలు జరుగుతున్నాయి. సికింద్రాబాద్ దక్కన్ మాల్, చిక్కడపల్లి గోదాం అగ్ని ప్రమాద ఘటనలు మరవక ముందే మరో పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం లీ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భయాందోళనలకు గురైన కార్మికులు కంపెనీ నుండి బయటకు పరుగులు తీశారు. మంటల్లో చిక్కుకుని కొంత మంది గాయపడ్డారు. ఎగిసి పడుతున్న మంటల ధాటికి కంపెనీ పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ […]
టెస్లా కంపెనీ అదినేత ఎలాన్ మస్క్.. ట్విట్టర్ని కొన్న సంగతి తెలిసిందే. నాటి నుంచి ఆయన రోజుకోక షాక్ ఇస్తూ వస్తున్నాడు. ట్విట్టర్ని స్వాధీనం చేసుకున్న తర్వాత.. బ్లూటిక్ పెయిడ్ వర్షన్ విధానాన్ని తీసుకువచ్చాడు మస్క్. అనగా.. బ్లూటిక్ సదుపాయం కొనసాగించాలంటే.. నెలకు కొంత మొత్తాన్ని చెల్లించాలని సూచించాడు. ఆ తర్వాత ట్విట్టర్ వాడే ప్రతి ఒక్కరు కూడా డబ్బులు చెల్లించేలా త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేయబోతున్నాడు అంటూ ప్రచారం సాగుతోంది. అంతేకాక మస్క్.. ట్విట్టర్ను స్వాధీనం […]
సాంకేతికత పెరిగిన తర్వాత మనుషుల మధ్య బంధాలు తగ్గిపోతున్నాయి.. అసలు స్పందించడమే మరిచిపోతున్నాడు. నిత్యం ఉరుకులు పరుగులతో బిజీగా ఉంటున్నాడు. కుటుంబ సభ్యులతోనే మాట్లాడే తీరిక లేనప్పుడు.. ఇక తన చుట్టూ ఉండే వారిని ఏం పట్టించుకుంటాడు. ప్రస్తుతం సమాజంలో పరిస్థితి ఇలానే ఉంది. అయితే అందరూ ఇలానే ఉంటారా అంటారా అంటే కాదు. కష్టంలో ఉన్న వారి గురించి తెలిస్తే చాలు.. ఆదుకునేందుకు ఎందరో దాతలు ముందురు వస్తారు. ఇలాంటి సంఘటనలు అనేకం నిత్యం వెలుగు […]