ఈ మధ్యకాలంలో తరచుగా అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవలే సికింద్రాబాద్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటన అందరికి తెలిసిందే. ఆ విషాద ఘటన మరువక ముందే తాజాగా హైదరాబాద్ లో మరో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
ఇటీవల తరచుగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. షార్ట్ సర్య్కూట్ వంటి ఇతర కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అగ్నిప్రమాదాల్లో ఎందరో అమాయకులు సజీవదహనం అయిపోతున్నారు. అంతేకాక మరేందరో తీవ్ర గాయాలతో నరకయాతన అనుభవిస్తున్నారు. అంతేకాక ఈ ప్రమాదాల కారణంగా భారీగా ఆర్థిక నష్టం సంభవిస్తుంది. కొన్ని నెలల క్రితం సికింద్రాబాద్ లోని ఓ భవనంలో అగ్నిప్రమాదం సంభవించి ముగ్గురు సజీవన దహనం అయ్యారు. అలానే రెండు రోజుల క్రితం తిరుపతి రేణిగుంట సమీపంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తాజాగా హైదరాబాద్ లోని ఓ ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జీడిమెట్లలో అగ్నిప్రమాదం సంభవించింది. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఓ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫార్మాకంపెనీలు రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అగ్ని ప్రమాదం జరిగిన పరిసర ప్రాంతమంతా దట్టంగా పొగ కమ్ముకుంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు రవీందర్ రెడ్డి(25), కుమార్(24) లుగా గుర్తించారు. స్థానికుల అందించిన సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాప సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది.
అలానే మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. భారీగా మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వేసవికాలం ప్రారంభమైందని, ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అగ్నిప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. వేసవిలో చిన్న నిర్లక్ష్యం కారణంగా పెద్ద ప్రమాదాలు జరగొచ్చని.. అలాంటి వాటిని నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. జీడిమెట్లలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.