ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అచ్యుతాపురం సెజ్లోని సాహితీ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. అనంతరం మంటలు అలముకున్నాయి.
ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అచ్యుతాపురం సెజ్లోని సాహితీ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. అనంతరం పెద్ద యెత్తున మంటలు అలముకున్నాయి. రియాక్టర్ క్లీన్ చేస్తుండగా.. ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటనలో రెండు రియాక్టర్లు పేలినట్లు సమాచారం. ఉదయం కార్మికులు షిప్టులో ఉండగానే ఈ ప్రమాదం జరిగింది. భారీ పేలుడుతో పాటు శబ్దాలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు చనిపోవడంతో పాటు పలువురు తీవ్రంగా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అచ్యుతాపురం సాహితీ ఫార్మా కంపెనీలో రియాక్టర్లు పేలడంతో భారీ శబ్దాలు వచ్చాయి. ఈ భారీ పేలుడుతో కార్మికులంతా బయటకు పరుగులు తీశారు. పేలుడుతో కెమికల్స్ అంటుకుని మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల భారీగా పొగలు వ్యాపించాయి. కెమికల్ కంపెనీలో పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. అయితే ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. మరి కొంత మంది గాయపడ్డారని సమాచారం. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.