మొబైల్ చేతిలోకి వచ్చాక సోషల్ మీడియా వేదికలైన ఇన్ స్టా, ఫేస్ బుక్, వాట్సప్, ఎక్స్ వంటి యాప్స్ను వినియోగించకుండా ఉండలేం. పొద్దున్న లేచిన దగ్గర నుండి నిద్రపోయే వరకు ఏదో ఒక యాప్ను వినియోగిస్తూనే ఉంటాం.
మొబైల్ చేతిలోకి వచ్చాక సోషల్ మీడియా వేదికలైన ఇన్ స్టా, ఫేస్ బుక్, వాట్సప్, ఎక్స్ వంటి యాప్స్ను వినియోగించకుండా ఉండలేం. పొద్దున్న లేచిన దగ్గర నుండి నిద్రపోయే వరకు ఏదో ఒక యాప్ను వినియోగిస్తూనే ఉంటాం. అప్పటికప్పుడు అవసరానికో, మరే ఇతర కారణాలతో కొన్ని యాప్స్ డౌన్ లోడ్ చేసుకుని.. వాటిని వినియోగించకుండా వదిలేస్తుంటాం. అయితే ఉపయోగం ఉన్నా లేకున్నా కొన్ని యాప్స్ ను ఫోనుల్లోకి డౌన్ లోడ్ చేయడం ద్వారా మాల్ వేర్ జరుగుతుంది. దీని వల్ల సైబర్ నేరగాళ్లకు మన డేటా చిక్కుతుంది. ఇక వాడు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా వ్యవహారం సాగిపోతుంది. దీని ద్వారా ఆయా వ్యక్తులను బెదిరించిన దాఖలాలు కూడా లేకపోలేదు.
ఇటీవల కొన్నియాప్స్ వల్ల నష్టం జరుగుతుందని కేంద్రం కొన్నింటిపై బ్యాన్ విధించిన సంగతి విదితమే. తాజాగా గూగుల్ 22 యాప్స్ ను ప్లేస్టోర్ నుండి తొలగించింది. మాల్ వేర్ దాడుల నుండి వినియోగదారులను రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ యాప్స్ వినియోగించుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించిన యాప్స్ జాబితాలో బారో టీవీ, డీఎంబీ యాప్, జిహో సాఫ్ట్ మొబైల్ రికవరీ యాప్, మ్యూజిక్ బడా, మ్యూజిక్ డౌన్లోడర్, బారో డిజిటల్ గిఫ్టింగ్ యాప్, న్యూ లైవ్, రింగ్టోన్స్ ఫ్రీ మ్యూజిక్, స్ట్రీమ్కార్ లైవ్ స్ట్రీమింగ్, లైవ్ప్లే, ఆన్ ఎయిర్ ఎయిర్లైన్ మేనేజర్, మ్యూజిక్ ప్లేయర్ – ఆడియో ప్లేయర్, ఏటీ ప్లేయర్, ట్రోట్ మ్యూజిక్ బాక్స్-ఫ్రీ ట్రోట్ మ్యూజిక్ ప్లేయర్ మొదలైనవి ఉన్నాయి.మొబైల్ ఫోన్ చార్జింగ్ అయిపోవడంతో పాటు.. డేటా కూడా ఖాళీ అయిపోతుందన్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని .. ఈ యాప్స్ ను తొలగించింది. ఇవి కూడా మీ మొబైల్స్ లో ఉంటే వెంటనే తొలగించుకోవాల్సి ఉంటుంది.