ఈరోజుల్లో ‘బ్యాంకు’ అంటే తెలియని వారు ఎవరున్నారండి. డబ్బులు వేయాలన్నా.. తీయాలన్నా బ్యాంకుకు వెళ్లాల్సిందే కదా. టెక్నాలజీ పరుగులు పెడుతున్న ఈరోజుల్లో ఇంకా బ్యాంకుకు ఎవరెళ్తున్నారు అనే వారు కూడా ఉన్నారనుకోండి. ఉన్నారు.. మారుమూల ప్రాంతాలలో ఇప్పటికీ బ్యాంకుకు వెళ్లి ట్రాన్సక్షన్స్ చేస్తున్న వారున్నారు. కాకుంటే.. మారుతోన్న కాలానికి అనుగుణంగా బ్యాంకింగ్ రంగంలోనూ మార్పలు వస్తున్నాయి. ఒకప్పుడు అకౌంట్లో డబ్బులు వేయాలన్నా, తీయాలన్నా బ్యాంకులకు వెళ్లి, క్యూలైన్లో నిల్చొని, రశీదు నింపి.. కౌంటర్ లో ఇస్తే.. అబ్బో.. ఇలా పెద్ద తతంగం ఉండేది.
అయితే,.. యూపీఐ పేమెంట్స్(ఫోన్ పే, గూగుల్ పే.. వంటివి) వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితుల్లో పూర్తిగా మార్పులొచ్చాయి. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు వెంటనే ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్ కు డబ్బులను ట్రాన్స్ఫర్ చేసుకునే రోజులు వచ్చేశాయి. ఇక డబ్బులు డ్రా చేసుకోవాలంటే.. రెండు దారులు.. ఒకటి బ్యాంకుకు వెళ్లి తీసుకోవడం.. రెండోది ఏటీఎం కి వెళ్లి తీసుకోవడం. బ్యాంకుకు వెళ్దామా అంటే.. ఎప్పుడు పబ్లిక్ ఎక్కువ. పోనీ.. ఏటీఎమ్ కి వెళ్దామా అంటే.. కచ్చితంగా ఎటీఎమ్ కార్డు పట్టుకెళ్లాల్సిందే. కానీ ఇకపై ఏటీఎమ్ కార్డు అవసరం లేకుండానే ఏటీఎమ్ ద్వారా డబ్బులు తీసుకోవచ్చు అంటోది ఆర్బీఐ. ఈ మేరకు.. దేశంలోని అన్ని బ్యాంకులు కార్డు లెస్ ట్రాన్సక్షన్స్ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకు రావాలని ఆదేశాలు ఇచ్చింది.
Card-less cash withdrawal to be made available at all ATMs: RBI
#RBI #ATM #CardlessWithdrawl pic.twitter.com/NEd3S2ISch
— Newspaper 😷 (@NewspaperANI) April 8, 2022
ఇది కూడా చదవండి: గూగుల్ పే, ఫోన్ పే కు పోటీగా టాటా పే..!
ఇప్పటికే.. అక్కడక్కడ ఇలాంటి ఏటీఎం లు కనిపిస్తున్నాయనుకోండి. కాకుంటే.. దేశంలో అన్ని బ్యాంకులు.. ఈ సౌకర్యాలు కల్పించాలనేది ఆర్బీఐ నిర్ణయం. కానీ.. ప్రస్తుతం ఉన్న ఏటీఎం లలో కార్డు లెస్ ట్రాన్సక్షన్స్ చేయాలంటే.. మొబైల్ ఫోన్ కు ఓటీపీ లాంటి వ్యవహారాలు ఉన్నాయి. అయితే.. అలానే కాకుండా స్మార్ట్ ఫోన్ లోని యూపీఐ యాప్ ను ఉపయోగించి డబ్బులు డ్రా చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించనున్నారు. ఈ విషయమై తాజాగా ఆర్టీఐ కీలక ప్రకటన చేసింది. శుక్రవారం జరిగిన ఆర్బీఐ మానిటరి పాలసీ సమవేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. యూపీఐ ద్వారా ఏటీఎంను డబ్బులు డ్రా చేసుకునే విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
RBI conducts in-person post Monetary Policy Press Conference with Governor @DasShaktikanta today after a gap of two years. #rbipolicy #rbigovernor #rbitoday
Link to the media interaction is available at:https://t.co/sqofV85xjQ pic.twitter.com/RSSzbrkVGS
— ReserveBankOfIndia (@RBI) April 8, 2022
ఇది కూడా చదవండి: ఈ స్కీమ్లో చేరితే పదేళ్ల పాటు నెలకు రూ.9,250 పెన్షన్!
ఈ నిర్ణయం వల్ల కార్డ్ క్లోనింగ్, కార్డ్ స్కిమ్మింగ్ లాంటి మోసాలకు అడ్డుకట్ట వేయొచ్చని ఆర్బీఐ అభిప్రాయం. ఈ సేవలు అందుబాటులోకి వస్తే వినియోగదారులు.. ఏటీఎం లలో యూపీఐ ఆప్షను సెలక్ట్ చేసుకొని స్మార్ట్ ఫోన్ లీని యాప్ సహాయంతో స్కాన్ చేసి అమౌంట్ ఎంటర్ చేయడం ద్వారా డబ్బులు తీసుకోవచ్చు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.