మన దేశంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. ప్రతి గుడి వెనక ఓ చరిత్ర దాగుంది. ఇక ఏళ్లు గడుస్తున్న కొద్ది.. కాలగర్భంలో కలిసిపోయిన ఆలయాలు ఎన్నో. ప్రకృతి ఉపద్రవాల కారణంగా పలు ఆలయాలు నదుల్లో మునిగిపోయాయి. అవి అప్పుడొకటి అప్పుడొకటి వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే 2020లో నెల్లూరు జిల్లా పెన్నాతీరంలో ఓ ఆలయం వెలుగు చూసింది. ఆ తర్వాత అది దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది. ఇక ప్రస్తుతం మరోసారి ఆ ఆలయ ప్రస్తావన వెలగులోకి వచ్చింది. ఈ సారి ప్రభాస్ కారణంగా ఆలయం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: ప్రభాస్ ఆదిపురుష్ సినిమాపై KTR సంచలన వ్యాఖ్యలు!
రెండేళ్ల క్రితం అనగా.. 2020 జూన్ 16వ తేదీన నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెన్నాతీరంలో అక్కడి స్థానిక యువకులు ఇసుక మేటల్లో జేసీబీలతో తవ్వకాలు చేపట్టారు. ఈ క్రమంలో వారికి ఇసుకు మేటల కింద శివాలయం దర్శనం ఇచ్చింది. కేవలం ఆలయ గోపురం మాత్రమే బయటకు కనిపించింది. పూర్తిగా తవ్వుదామంటే.. ఆయలం కూలిపోతుందనే ఉద్దేశంతో ఆగిపోయారు. విషయం తెలిసిన వెంటనే పురావస్తు శాఖ అధికారులు కూడా అక్కడకు వచ్చారు. ఆలయంలో ఉన్న శివ లింగాన్ని ప్రస్తుతం ఉన్న పెరుమాళ్లపాడు గ్రామానికి తరలించాలనే ప్రయత్నం చేశారు కానీ, మధ్యలోనే ఆపేశారు. ఆ తర్వాత ఈ ఆలయం గురించి మీడియాలో రావడంతో.. అది దేశవ్యాప్తంగా ఫేమస్ అయింది. ఎంతోమంది నెల్లూరుకి వచ్చి నదీ తీరంలో ఇసుక తిన్నెల్లో నుంచి బయటకు వచ్చిన ఆలయాన్ని చూసి వెళ్లారు.
ప్రభాస్ సినిమా షూటింగ్ తర్వాత మరోసారి వార్తల్లోకి..
ఆలయం బయల్పడిన ఈ ప్రాంతం నిర్మానుష్యంగా ఉంటుంది. చుట్టూ వేరుశనగ పైర్ల మధ్య ఇసుక తిన్నెల్లో భోళా శంకరుడు కొలువై విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా ఉంటుంది. జనాలు పెద్దగా కనిపించరు. ఈ క్రమంలో ఇటీవల ప్రభాస్ కొత్త సినిమా టీమ్ అక్కడకు షూటింగ్ కోసం రావడంతో మరోసారి నెల్లూరు జిల్లా పెరుమాళ్లపాడు వార్తల్లోకెక్కింది. రెండు రోజులపాటు అక్కడ సినిమా షూటింగ్ చేసి వెళ్లింది చిత్ర బృందం. సువిశాల పెన్నా తీరం, చుట్టూ ఇసుక తిన్నెలు.. పచ్చని చెట్లు వీటన్నిటి మధ్య సగం ఇసుకలోకి కూరుకుపోయిన ఆలయం.. ఇలాంటి అరుదైన దృశ్యాలు ఉన్నాయి కాబట్టే సినిమా యూనిట్ చిత్రీకరణకోసం ఇంత దూరం వచ్చింది. దాంతో మరోసారి జనాలు ఈ ఆలయాన్ని చూడ్డానికి తరలి వస్తున్నారు.
ఇది కూడా చదవండి: KTR వ్యాఖ్యల పై మండిపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్!
ఆలయానికి 200 ఏళ్ల చరిత్ర…
ఈ ఆలయానికి 200 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రస్తుతం ఈ ఆలయం ఉన్న ప్రాంతంలో అప్పట్లో పెరుమాళ్లపాడు అనే గ్రామం ఉండేదని చరిత్రకారులు చెబుతారు. గ్రామం పెన్నానదీ తీరంలో ఉండటం.. కాలక్రమేణా అది కోతకు గురికావడంతో ఊరు ఊరంతా అక్కడినుంచి తరలి వెళ్లింది. ఇళ్లు, పొలాలు, ఇతర నిర్మాణాలన్నీ నది ఇసుకతో మేట వేసుకు పోయాయి. ఆ తర్వాత ఊరి గురించి ఎవరూ పట్టించుకోలేదు. గ్రామంలోని వృద్ధులు మాత్రం అప్పుడప్పుడూ అసలు పెరుమాళ్లపాడు పెన్నా తీరంలో ఉండేదని, అక్కడ ఓ గుడి కూడా ఉండేదని యువకులకు చెబుతుండేవారు. రెండేళ్ల క్రితం లాక్ డౌన్ సమయంలో ఇసుక తవ్వకాల సమయంలో ఈ గుడి ఆనవాళ్లు కనపడ్డాయి. ఇది నాగేశ్వరాలయం. నాగేశ్వరాలయం అనే పేరుకి తగ్గట్టే శివాలయంలో నిత్యం పాముల సంచారం ఉంటుందని స్పష్టంగా తెలుస్తుంది. పాము కుబుసాలు ఆలయ ప్రాంగణంలో నిత్యం కనిపిస్తుంటాయి.
ఇది కూడా చదవండి: సలార్: ఒక్క ఛేజింగ్ సీక్వెన్స్ కోసం 20కోట్లా..?
ప్రస్తుతం ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలన్నా కష్టసాధ్యంగా కనిపిస్తోంది. ఇసుకను తవ్వి పూర్తిగా ఆలయాన్ని బయటకు తీస్తే ఆలయ నిర్మాణం కూలిపోతుందనే భయంతో దాన్ని అలాగే ఉంచారు. ప్రస్తుతం ఆ చుట్టుపక్కలకు ఎవరూ వెళ్లరు. ఇటీవల వర్షాలకు ఇసుక మరింతగా ఆలయంలోకి వెళ్లిపోయింది. ఆలయ గోపురం పైభాగం మాత్రమే కనపడుతుంటుంది. 1850లో పెన్నా నదికి వచ్చిన వరదల్లో ఆలయం పూర్తిగా నీటమునిగిపోయిన తర్వాత దాదాపు 200 ఏళ్లకు అది బయటపడిందని భావిస్తున్నారు. 200 ఏళ్లయినా ఆలయం ఇంకా చెక్కుచెదరకుండా ఉండటం ఆశ్చర్యచకితులను చేస్తోంది. మరి ఈ పురాతన ఆలయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.