హెచ్డీఎఫ్ సీ బ్యాంక్ తమిళనాడులోని బ్రాంచ్ సేల్స్ ఆఫీసర్ల ఉద్యోగాల నియామకం కోసం ప్రకటన ఇచ్చింది. అయితే ఇందులో ఒక కండిషన్ పెట్టింది. 2021లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు కాదని పేర్కొంది. కొవిడ్ ఉండటంవల్ ఆ సమయంలో ప్రభుత్వాలు విద్యార్థులకు పరీక్షలు కూడా నిర్వహించలేదు. అందరినీ ఉత్తీర్ణులను చేశారు. కొవిడ్ కాలంలో పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు పనికిరారని పేర్కొంది. డిగ్రీ ఉత్తీర్ణతతో విడుదల చేసిన ఈ ఉద్యోగ ప్రకటన ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. దీనిపై తీవ్రంగా విమర్శలు రావడంతో హెచ్డీఎఫ్ సీ యాజమాన్యం స్పందించింది.
అభ్యర్థులు కొవిడ్ నేపథ్యంలోనే పరీక్షలు రాయలేని దుస్థితి ఏర్పడింది. ఇక తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వాలు కొన్ని నిబంధనల మేరా పాస్ చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ, హెచ్డీఎఫ్సీకి సంబంధించిన ఓ జాబ్ సర్కులర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. డిగ్రీ క్వాలిఫికేషన్ తో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసిన హెచ్డీఎఫ్సీ అందులో నుంచి 2021 పాస్ అవుట్ బ్యాచ్ అనార్హులని చేసింది. అయితే దీనిపై తీవ్రంగా విమర్శలు వచ్చి వివాదానికి దారి తీయడంతో హెచ్డీఎఫ్సీ యాజమాన్యం స్పందించింది. అది అక్షర దోషమని వివరణ ఇచ్చింది. ప్రకటనలో తప్పు వచ్చినందుకు విచారం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు.
తర్వాత డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు అని, పాస్ అయిన సంవత్సరంతో ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. తప్పును సరిదిద్దడానికి ప్రకటనను ఇచ్చామని చెప్పింది. అయితే, నెటిజన్లు మాత్రం ఈ వైరల్ జాబ్ నోటిఫికేషన్ను తమదైన రీతిలో స్పందిస్తున్నారు. పరీక్షలు లేకుండా పాసై కరోనా బ్యాచ్గా ముద్రవేయించుకున్న విద్యార్థులు ఎందుకూ పనికిరాకుండా పోతున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనమని వాపోయారు. ఇక వీటిపై విపరీతంగా మీమ్స్ కూడా వచ్చేశాయి.