భారతదేశపు తొలి ర్యాపిడ్ ఎలకా్ట్రనిక్ కొవిడ్-19 ఆర్ఎన్ఏ టెస్ట్ కిట్ – కొవిహోమ్. సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని ఐఐటీ హైదరాబాద్ ఎలకా్ట్రనిక్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ శివగోవిందం దీన్ని రూపొందించారు. కరోనా లక్షణాలు కనిపిస్తే టెస్టింగ్ కోసం ఆసుపత్రులకు పరుగులు పెట్టకుండా ఇంట్లోనే పరీక్ష చేసుకునే కిట్ను ఐఐటీ హైదరాబాద్ అభివృద్ధి చేసింది. ‘కొవిహోమ్’ అని దీనికి పేరు పెట్టింది. దీనివల్ల ప్రజలు ఇంటి దగ్గరే స్వయంగా పరీక్ష చేసుకుని, వైరస్ సోకిందో లేదో నిర్ధరించుకునే వీలు కలుగుతుంది.
అనుమానితులు తమ గొంతు, ముక్కులోని స్రావాలను కిట్లోని ఎలక్ట్రానిక్ చిప్పై ఉంచితే 30 నిమిషాల్లోనే ఫలితం వచ్చేస్తోంది. అంతకంటే ముందు ఈ కిట్ను స్మార్ట్ఫోన్కు అనుసంధానించాల్సి ఉంటుంది. అందులోని ఐ-కొవిడ్ యాప్ ద్వారా అరగంటలోనే కచ్చితమైన ఫలితం వచ్చేస్తుంది. పెద్దఎత్తున ఉత్పత్తి చేస్తే రూ.300 -400కే అందుబాటులోకి వస్తుందని అంచనా.
కరోనాకు సంబంధించినంత వరకూ ఆర్టీ-పీసీఆర్ను ప్రామాణిక పరీక్షగా చెబుతారు. ఈ టెస్ట్కిట్ దాంతో సమాన ఫలితాలను ఇస్తోందని ఐఐటీహెచ్ అధికారులు తెలిపారు. అయితే ఐసీఎంఆర్ సూచనల మేరకు సీఎ్సఐఆర్-సీసీఎంబీ ఈ టెస్ట్ కిట్ సామర్థ్యాన్ని పరిశీలించి దీని సెన్సిటివిటీ 91.3 శాతం, స్పెసిఫిసిటీ 98.2 శాతంగా తేల్చింది.
కరోనా సమయంలో సాంకేతిక కార్యక్రమాల ద్వారా ఐఐటీహెచ్ ప్రజలకు చేదోడువాదోడుగా ఉందని ఆ సంస్థ డైరెక్టర్ బీఎ్స.మూర్తి అన్నారు. ప్రొఫెసర్ శివ గోవిందం తయారుచేసిన ‘కొవిహోమ్’ అద్భుతమైన ఫలితాలనిస్తోందని ఆయన వెల్లడించారు. ఈ కిట్కు పేటెంట్ కోసం దరఖాస్తు చేసినట్టు చెప్పారు.
కొవిహోమ్ పరీక్ష , కరోనావైరస్ లక్షణాలు లేకుండా వైరస్ సోకిన వారిని త్వరగా గుర్తిస్తుంది. దీంతో వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చు. ఎవరికైనా పాజిటివ్ వస్తే వైరస్ వ్యాప్తి చెందకుండా సెల్ఫ్ ఐసోలేషన్ కి వెళ్లమని సూచించవచ్చని చెప్పారు.