భారీ వర్షాల కారణంగా వరద ఉదృతి ఎంత దారుణంగా ఉందో గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. నదీ జలాలు, చెరువులు నిండిపోవడంతో ఎటూ దారి లేక ఆ వరద నీరంతా రోడ్లపైకి వస్తుంది. దీంతో రోడ్లన్నీ జలాశయాలుగా మారుతున్నాయి. లోతు ఉండదని రోడ్డు దాటే ప్రయత్నం చేస్తే.. ఆ వరద ప్రవాహానికి తట్టుకోలేక కొట్టుకుపోతున్నారు. అదృష్టం కొద్దీ కొందరు ప్రాణాలతో బయట పడుతున్నారు. తాజాగా ఓ యువకుడు ఇలానే రోడ్డు దాటే ప్రయత్నం చేసి వరదల్లో చిక్కుకున్నాడు. అయితే పోలీసులు వెంటనే స్పందించి ఆ యువకుడ్ని కాపాడారు. ఈ ఘటన హిమాయత్ సాగర్ వద్ద చోటు చేసుకుంది.
సర్వీస్ రోడ్డు బ్రిడ్జ్పై పోటెత్తుతున్న వరద ప్రవాహంలో ఓ యువకుడు బైక్పై వెళ్ళే ప్రయత్నం చేశాడు. ఆ ప్రవాహంలో బైక్తో సహా కొట్టుకుపోతూ రేలింగ్ సపోర్ట్తో ప్రమాదం నుండి బయటపడ్డాడు. కాసేపటికి రాజేంద్ర నగర్ పోలీసులు అక్కడకి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేసి ట్రాఫిక్ క్రేన్ సాయంతో ఆ యువకుడ్ని కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పోలీసులు చేసిన పనికి నెటిజన్లు అభినందనలు తెలియజేస్తున్నారు. మరి ప్రాణాలకు తెగించి ఆ యువకుడ్ని కాపాడిన పోలీసులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఈరోజు సాయంత్రం హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డు వంతెన పైనుంచి వరద నీరు పారుతున సందర్భంలో బైక్ పై వంతెన దాటడానికి ప్రయత్నించిన ఒక యువకుడు వరదకు కొట్టుకుపోతున్నప్పుడు వెంటనే స్పందించి యువకుణ్ణి కాపాడిన రాజేంద్ర నగర్ ట్రాఫిక్ పోలీసులు. @TelanganaDGP @TelanganaCOPs @CYBTRAFFIC pic.twitter.com/94NLdbVpDQ
— Cyberabad Police (@cyberabadpolice) July 26, 2022