యాక్సిడెంట్లో గాయపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టీమిండియా స్టార్ రిషభ్ పంత్ గురుంచి కీలక అప్డేట్ వచ్చేసింది. ప్రస్తుతానికి పంత్ చాలా హుషారుగా ఉన్నాడట. మునుపటిలానే ఫన్నీ జోకులేస్తూనవ్వుతూ, నవ్విస్తూ ఉన్నాడట. ఈ విషయాలన్నీ అతడిని కలిసిన యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు. ఇవేకాక.. పంత్ ఆరోగ్యం గురుంచి యువీ మరిన్ని విషయాలు వెల్లడించాడు.
‘రిషబ్ పంత్..‘ అందరి నోటా ఇదే మాట. ఐపీఎల్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ‘అయ్యో.. పంత్ మిస్సాడే’ అన్న వెలితి. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పంత్.. తిరిగి ఎప్పుడు జట్టులో చేరుతాడా అని అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పంత్ కూడా తన ఆరోగ్యం గురుంచి ఎప్పటికప్పుడు అభిమానులకు తెలియజేస్తూనే ఉన్నాడు. తాను చేసే ప్రతి చిన్న పని అభిమానులకు సంతోషాన్ని పంచేదే కనుక, అన్ని విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. తాజాగా, ఈ యువ వికెట్ కీపర్ని.. మాజీ క్రికెటర్, సిక్సర్ల రారాజు యువరాజ్ సింగ్ కలిశారు.
పంత్ను కలిసిన యువీ అతడి ఆరోగ్యం గురించి అన్ని విషయాలు ఆరా తీశాడు. ‘ఎలా ఉన్నావ్..? అని మొదలుపెట్టి ఎప్పుడు జట్టులో చేరతావ్..? వరకు అతడి గురుంచి అన్ని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. ఈ మేరకు పంత్తో కలిసి ఉన్న ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్న యువీ, అతడి ఆరోగ్యం గురుంచి కీలక విషయాలు వెల్లడించాడు. ప్రస్తుతానికి పంత్ బుడి బుడి అడుగులు వేస్తున్నాడని, పాజిటివ్గా ఉంటూ త్వరగా కోలుకునే ప్రయత్నం చేస్తున్నాడని తెలిపాడు.
“పంత్.. బుడిబుడి అడుగులు వేస్తున్నాడు. త్వరలోనే ఈ ఛాంపియన్ మళ్లీ ప్రకాశించబోతున్నాడు. కలిసి నవ్వుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సమయంలోనూ చాలా పాజిటివ్ అటిట్యూడ్తో ఉన్నాడు. చాలా ఫన్నీ మనిషి. నీకు మరింత శక్తి కలగాలి..”అని యువీ రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. పంత్ను కలిసినందుకు యువీపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. గాయపడ్డ ఆటగాడిని అలా వదిలివేయకుండా.. ఇలా ఒక్కొక్కరిగా కలవడం వల్ల అతడికి మరింత మానసిక దైర్యం కలుగుతుందని కామెంట్స్ చేస్తున్నారు.
On to baby steps !!! This champion is going to rise again 🔜 .was good catching up and having a laugh 😅what a guy positive and funny always !! More power to you 🤛 💫 @RishabhPant17 pic.twitter.com/OKv487GrRC
— Yuvraj Singh (@YUVSTRONG12) March 16, 2023
కాగా, ఈ ఏడాది ఆరంభంలో పంత్ ఢిల్లీ నుంచి తన సొంత రాష్ట్రం ఉత్తరాఖండ్కు వెళ్తూ మార్గమధ్యలో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న పంత్.. రెండ్రోజుల క్రితం స్విమ్మింగ్ పూల్లో స్టిక్ సాయంతో నడుచుకుంటూ వెళ్తున్న ఫోటో షేర్ చేశాడు. గాయం నుంచి కోలుకుంటున్న పంత్.. వన్డే వరల్డ్ కప్ నాటికైనా తిరిగి భారత జట్టులో చేరాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.యువీ.. పంత్ను కలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Grateful for small thing, big things and everything in between. 🙏#RP17 pic.twitter.com/NE9Do72Thr
— Rishabh Pant (@RishabhPant17) March 15, 2023