టీ20 వరల్డ్కప్లో ఈ నెల 24 ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టేడియంలో కొన్ని వేల మంది ఈ మ్యాచ్ మజాను ఆస్వాదిస్తే.. కోట్ల మంది టీవీలకు అతుక్కుపోతారు. కాగా ఇప్పుడు క్రికెట్ సంబరాన్ని సినిమా థియేటర్లలో కూడా ఎంజాయ్ చేయవచ్చు. టీమిండియా వరల్డ్లో ఆడే ప్రతి మ్యాచ్ను ఐనొక్స్, పీవీఆర్ మల్లీప్లెక్స్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఐనొక్స్, పీవీఆర్ యాజమాన్యలు వెల్లడించాయి.
ఇదీ చదవండి: టీ20 వరల్డ్ కప్: పాకిస్తాన్తో ఇండియా క్రికెట్ ఆడొద్దు.. ఎందుకంటే?
టీ20 వరల్డ్ కప్ ఫైనల్, సెమీఫైనల్తో పాటు టీమిండియా ఆడే లీగ్ మ్యాచ్లను కూడా థియేటర్లలో ప్రసారం చేయనున్నారు. దేశవ్యాప్తంగా 35 ప్రాంతాల్లోని 75 మల్టీప్లెక్స్లలో ఈ ప్రత్యక్ష ప్రసారాలు జరగనున్నాయి. కాగా టిక్కెటు ధర ప్రాంతాన్ని బట్టి రూ.200 నుంచి రూ.500 వరకు ఉంటుందని సమాచారం. క్రికెట్ మ్యాచ్లను ఇలా థియేటర్లలో ప్రసారం చేయడం ఇదే మొదటి సారి. గతంలో వరల్డ్కప్ సందర్భాల్లో కొన్ని చోట్ల ప్రోజక్టర్లు పెట్టి క్రికెట్ అభిమానులు మ్యాచ్ను ఎంజాయ్ చేసేవారు. క్లబ్లు, రెస్టారెంట్లలో కూడా పెద్ద తెరలపై మ్యాచ్ వీక్షించే అవకాశం ఉండేది. ఇప్పుడు ఏకంగా మల్టీప్లెక్స్లలోనే వరల్డ్ కప్ మ్యాచ్లను చూసే అవకాశం కలగనుంది. అందులోనూ ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉండే కిక్కే వేరు.
ఇదీ చదవండి: టీ-ట్వంటీ వరల్డ్ కప్: పాకిస్థాన్ ఫ్యాన్ కి టీమిండియా అభిమాని ఝలక్!