స్వదేశంలో సౌతాఫ్రికాపై తొలిసారి టీ20 సిరీస్ గెలిచిన భారత జట్టు.. అదే ఊపులో వన్డే సిరీస్ కూడా తన ఖాతాలో వేసుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికా 99 పరుగులకే ఆలౌట్ కాగా.. అనంతరం భారత జట్టు 3 వికెట్లు కోల్పోయి ఆ లక్ష్యాన్ని చేధించింది. ఈ విజయంతో వన్డే సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుంది. అయితే.. ఈ సిరీస్ లో సౌతాఫ్రికా యాజమాన్యం మూడు మ్యాచుల్లో.. ముగ్గురు వేరు వేరు కెప్టెన్లను బరిలోకి దించడం విశేషం.
టీ20 సిరీస్ ను 2-1 తేడాతో కోల్పోయిన సౌతాఫ్రికా వన్డే సిరీస్ ను సైతం 2-1 తేడాతో కోల్పోయి నిరాశతో వెనుదిరిగింది. సరైన ఆటతీరు కనపరచక వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ కు అర్హత కోల్పోయింది.. సౌతాఫ్రికా. అయినా వారి బ్యాటర్లలో ఏలాంటి మార్పు లేదు. తొలి రెండు వన్డేల్లో పర్వాలేదనిపించనా.. మూడో వన్డేల్లో మాత్రం వచ్చిన బ్యాటర్ వచ్చినట్లే పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో ఆ జట్టు 99 పరుగులకే కుప్పకూలింది. సఫారీ జట్టులో 8 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ 4 వికెట్లు పడగొట్టగా, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, షహబాజ్ అహ్మద్ తలా రెండు చొప్పున వికెట్లు తీశారు.
అనంతరం వంద పరుగుల లక్యంతో బరిలోకి దిగిన టీమిండియా 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఆ లక్ష్యాన్ని చేధించింది. శిఖర్ ధవన్ (8), ఇషాన్ కిషన్ (10) ఇద్దరూ విఫలమయినా.. మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ 49 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎన్గిడీ, బ్యోర్న్ ఫోర్టూయిన్ చెరో వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ను భారత్ 2-1 తేడాతో సొంతం చేసుకుంది. అయితే.. ఈ సిరీస్ లో సఫారీ జట్టుకు మూడు మ్యాచుల్లో ముగ్గురు వేరు వేరు ఆటగాళ్లు కెప్టెన్లుగా వ్యవహరించారు. తొలి వన్డేలో రెగ్యులర్ కెప్టెన్ టెంబా బవుమా సారధిగా వ్యవహరించగా, రెండో వన్డేలో కేశవ్ మహరాజ్ ఆ బాధ్యతలు నిర్వర్తించాడు. ఇక మూడో వన్డేలో విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ మిల్లర్ కెప్టెన్ గా వ్యవహరించాడు.
Kuldeep, Washy, Siraj bowl India to a dominant win in the ODI series decider #INDvSA
👉 https://t.co/zbLsDgPHAK pic.twitter.com/k4YbSKfBlr
— ESPNcricinfo (@ESPNcricinfo) October 11, 2022
కాగా, వన్డే సిరీస్ లో భారత జట్టు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా, హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్.. ఇలా సీనియర్ క్రికెటర్లు ఎవ్వరూ లేకుండానే బరిలోకి దిగగా, సఫారీ జట్టు మాత్రం పూర్తి ప్లేయర్లతో, స్టార్లతో బరిలో దిగింది. అయినప్పటికీ విజయం మాత్రం భారత్నే వరించింది.