భారత జట్టు కొత్త సారధిగా రోహిత్ శర్మ పగ్గాలు చేపట్టాక.. అపజయం అనే పదానికి అర్థమే తెలియనట్టుగా.. వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. టీ20వరల్డ్ కప్ తరువాత కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం..రోహిత్ శర్మకు ఆ బాధ్యతలు అప్పగించడం చక చకా జరిగిపోయాయి. రోహిత్ కెప్టెన్ గా ఎంపికయ్యాక..న్యూజిలాండ్తో టీ20 సిరీస్, విండీస్తో వన్డే, టీ20 సిరీస్, శ్రీలంకతో టీ20 సిరీస్లను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు, లంకతో టెస్టు సిరీస్కి సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో ఒక వార్త.. అటు రోహిత్ శర్మను..ఇటు కోచ్ రాహుల్ ద్రవిడ్ ను భయపెడుతోంది.
శ్రీలంకతో సిరీస్కు పలువురు సీనియర్ ఆటగాళ్లు.. కోహ్లీ, బుమ్రా,షమీ మొదలైన వారికి విశ్రాంతినిచ్చారు. ఈ క్రమంలో పలువురు యువ ఆటగాళ్లు.. సంజు సాంసన్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్..ఇలా చాలా మంది ఆటగాళ్లు జట్టులో చోటు దక్కించుకోవడమే కాకుండా.. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి, గాయంతో సూర్యకుమార్ యాదవ్ లేకపోవడంతో.. తుది జట్టులో స్థానం సంపాదించుకున్న అయ్యర్..మూడవ స్థానంలో బ్యాటింగ్ కు దిగి.. మూడు టీ20ల్లోనూ వరుసగా..57, 74, 73 పరుగులతో అద్భుతంగా రాణించాడు. మొత్తంగా ఈ సిరీస్లో 204 పరుగులు చేసిన అయ్యర్ ఒక సారి కూడా ఔటవ్వలేదు. మూడుకి మూడు మ్యాచుల్లోనూ నాటౌట్గా నిలిచిన శ్రేయాస్ అయ్యర్, రెండు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు కూడా దక్కించుకున్నాడు.
Man of the Match ✅
Man of the Series ✅How good was @ShreyasIyer15 in this series 👏👏@Paytm #INDvSL pic.twitter.com/654OhvNlTa
— BCCI (@BCCI) February 27, 2022
మరో యువ ఆటగాడు రవి బిష్ణోయ్.. ఐపీఎల్ లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ జాతీయ జట్టులో చోట ఎందుకు కల్పించట్లేరు అన్న ప్రశ్న మొన్నటి వరకు ఉండేది. ఈ నెల ప్రారంభంలో వెస్టండీస్ తో జరిగిన టీ20 సిరీస్ లో అరంగ్రేటం చేసిన బిష్ణోయ్ అద్భుతంగా రాణించాడనే చెప్పుకోవాలి. పొట్టి ఫార్మటు లో.. భారీ సిక్సులతో విరుచుకు పడగల వెస్టండీస్ బ్యాటర్ ను తన స్పిన్ మాయాజాలంతో బాగానే బోల్తా కొట్టించగలిగాడు. 10 వ ఓవర్ తరువాత బౌలింగ్ కు వచ్చినప్పటికీ కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ.. భారీ పరుగులు ఇచ్చాడనే అపకీర్తి మూటగట్టుకోకుండా తక్కువ ఎకానమీతో అదరగొట్టాడనే చెప్పుకోవాలి.
Innings Break!
After opting to bat first, Sri Lanka post a total of 146/5.#TeamIndia chase coming up shortly. Stay tuned!
Scorecard – https://t.co/rmrqdXJhhV #INDvSL @Paytm pic.twitter.com/RA8sdYJXGT
— BCCI (@BCCI) February 27, 2022
‘ఇలా.. ప్లేయర్లు రాణిస్తుండడం టీమ్కి మంచిదే. తుది జట్టుకి సెలక్ట్ చేయడం మరింత కష్టంగా మారొచ్చు. అయితే ఫామ్లో లేని వాళ్లకంటే ఫామ్లో ఉన్నవారిని ఆడిస్తే రిజల్ట్ బాగుంటుంది కదా..’ అంటూ కామెంట్ చేశాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ ప్రయోగాలన్నీ.. ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది(2022) జరగబోయే టీ20 ప్రపంచకప్ కోసమనే చెప్పుకోవాలి. అప్పటకి విరాట్ కోహ్లీ.. అందుబాటులోకి రావడం ఖాయం..అలాంటి పరిస్థితి వస్తే.. విండీస్తో జరిగిన టీ20 సిరీస్లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చి, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ని పక్కనబెట్టే సాహసం చేయకపోవచ్చు. మరి శ్రీలంకతో సిరీస్ లో అదరగొట్టిన అయ్యర్ ను కుర్చోపెడతారా, అది కరెక్ట్ కాదేమో. మరీ.. రన్ మెషిన్ విరాట్ కోహ్లీని కుర్చోపెడతారా. ఇలాంటి గందరగోళంలో ఉంది టీమిండియా.
రోహిత్ వ్యాఖ్యలపై విరాట్ కోహ్లీ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో ఫెయిలైన కోహ్లీ, ఆ తర్వాత టీ20 సిరీస్లో రెండు మ్యాచుల్లో ఓ హాఫ్ సెంచరీ బాదాడు. రెండున్నరేళ్లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోతున్నా, హాఫ్ సెంచరీలు చేస్తూ.. రోహిత్ శర్మ కంటే మెరుగైన ప్రదర్శనే ఇస్తున్నాడనే చెప్పుకోవాలి. అయితే.. విరాట్ కోహ్లీ గైర్హజరీలో శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ కూడా మూడో స్థానంలో రాణించి ఆకట్టుకున్నారు కావున.. కోహ్లీని తప్పించి, ఆ స్థానంలో సూర్యకు అవకాశం ఇవ్వాలని రోహిత్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
All geared up ✅
LIVE action coming up soon. Stay tuned!https://t.co/ImBxdhXjSc #INDvSL @Paytm pic.twitter.com/rPiK27Q71E
— BCCI (@BCCI) February 26, 2022
రోహిత్ వ్యాఖ్యల్లో ఎలాంటి ఉద్దేశం లేదని, ఫామ్లో ఉన్న ప్లేయర్లను ఆడిస్తామని చెప్పినంత మాత్రాన.. విరాట్ను పక్కనబెడతామని చెప్పినట్టు కాదని అంటున్నారు టీమిండియా అభిమానులు. ఇలా ఒక ప్లేస్ కాదు.. హార్దిక్ పాండ్యా తిరిగొస్తే.. వెంకటేష్ అయ్యర్ పరిస్థితి అంతే. బుమ్రా, షమీ తిరిగొస్తే.. దీపక్ చాహర్, హర్షల్ పటేల్, సిరాజ్, శార్దూల్ థాకూర్ పరిస్థితి అంతే. టీమిండియా మూడవ స్థానంలో ఎవరిని తుది జట్టులో ఆడించాలన్న విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Four changes to the #TeamIndia Playing XI for the final T20I.
Live – https://t.co/gD2UmwjsDF #INDvSL @Paytm pic.twitter.com/w3C7sHD5yk
— BCCI (@BCCI) February 27, 2022