బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. వైసీపీలో క్రేజ్ ఉన్న యువ నాయకుడు ఎవరంటే, కర్నూలు జిల్లాకు చెందిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేరే వినిపిస్తుంది. వైసీపీ యువనేతల్లో సిద్ధార్థ్కు ప్రత్యేకంగా అభిమానులున్నారు. అందరినీ ఆకట్టుకునే వాక్చాతుర్యం, ప్రత్యర్థులపై బాణాల్లాంటి విమర్శలు చేయడంలో సిద్ధార్థ్ తర్వాతే ఎవరైనా. పార్టీకి ఎంతో నమ్మకంగా ఉంటున్న బైరెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక పదవి కట్టబెట్టారు. ఏపీ స్పోర్ట్ అథారిటీ చైర్మన్ (శాప్) గా జగన్ ప్రభుత్వం నియమించింది.
కొంతకాలంగా బైరెడ్డి సైలెంట్గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వైసీపీ నుంచి టీడీపీకిలోకి వెళుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. నందికొట్కూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్ధర్తో ఆయనకు విభేదాలున్నయని.. ఈ నేపథ్యంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పార్టీ వీడతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్తో కూడా ఆయన భేటీ అయ్యారని, త్వరలో కండువా కప్పుకోనున్నారనే వార్త.. బైరెడ్డి వ్యతిరేక వర్గం, వైసీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ ప్రచారాన్ని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గం కొట్టిపారేస్తోంది. ఈ ప్రచారం ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని టీడీపీ ఆడుతున్న మైండ్ గేమ్గా బైరెడ్డి అభిమానులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: జగన్ మోహన్ రెడ్డికి బాలినేని రిటర్న్ గిఫ్ట్!
బైరెడ్డి సిద్దార్థ్ మాట మీద నిలబడే వ్యక్తిని.. ప్రాణం పోయేవరకు, తన చివరి శ్వాస వరకు వైఎస్ జగన్తోనే ఉంటానని చెప్పారని ఆయన సన్నిహితులు అంటున్నారు. ప్రస్తుతానికి బైరెడ్డి శాప్ ఛైర్మన్ హోదాలో, వైఎస్సార్సీపీ నేతగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇటీవల మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ సమయంలో విజయవాడలోనే ఉన్నారు. నాలుగు రోజుల క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కర్నూలు జిల్లా పర్యటనకు వస్తే స్వాగతం పలికారు. ఈ మధ్యనే వైద్యఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన విడదల రజనిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇలా బైరెడ్డి పార్టీకి దగ్గరగానే ఉంటున్నా,రు. మొత్తానికి బైరెడ్డి ఎపిసోడ్ చర్చనీయాంశమైంది.