ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక రంగం మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి ఆయన కుటుంబ సభ్యులకే కాక.. పార్టీకి తీరని లోటే. ఇక పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మేకపాటి గౌతమ్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. విభజన ద్వారా పారిశ్రామిక రంగం మొత్తం తెలంగాణాలో స్థిరపడటంతో ఒక రకంగా రాష్ట్రం పారిశ్రామికంగా తొలి అడుగులు వేస్తున్న తరుణంలో చురుకైన, ఉన్నత విద్యావంతుడు, సమర్థుడైన గౌతమ్ రెడ్డికి పారిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్. గడిచిన రెండేళ్లలో ఆయన రాష్ట్రానికి పెట్టుబడులు, కంపెనీలను తీసుకురావాడానికి ఎంతో కృషి చేశారు.
వివాదరహితుడు, నిస్వార్థ సేవకుడైన ప్రజానాయకుడిగా గుర్తింపు పొందిన గౌతమ్ రెడ్డి మృతితో ప్రస్తుతం యావత్ పరిశ్రామిక రంగం, నిరుద్యోగులు, విద్యార్థులు తమ భవిష్యత్తుకు భరోసా కల్పించే నాయకత్వం కోసం ఆశగా ఒకరి వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో గౌతమ్ రెడ్డి స్థానంలో ఆయనలా.. అందరిని కలుపుకుని పోయేవాడు, అందరిని మెప్పించే వాడు, అందరితో అర్థవంతమైన చర్చలు జరిపే వాడు, అందరికి తలలో నాలుకలా ఉండే గడికోట శ్రీకాంత్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగిస్తారనే టాక్ బలంగా వినిపిపోస్తోంది.
ఇది కూడా చదవండి : మేకపాటి కుటుంబానికి సీఎం జగన్ అభయం! రంగంలోకి వారసుడు!
గడికోట శ్రీకాంత్ రెడ్డి ఉన్నత విద్యావంతుడు మాత్రమే కాక పార్టీ, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్ కు విశ్వాసపాత్రుడు కూడా కావడం కలిసోచ్చే అంశం. వెనుకబడిన ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వస్తూ, ఉపాధి కోసం ఊర్లకు ఊర్లే వలసలు పోయే జీవితాలను దగ్గరగా చూసి ఉండటం కూడా బాధ్యతల్లో కలిసోచ్చే అంశం అవుతుందని భావిస్తున్నారు. ప్రజా సమస్యలు, ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక రంగం పై పూర్తి అవగాహన కలిగి ఉండటం వల్ల గడికోట శ్రీకాంత్ రెడ్డి కి పరిశ్రమల శాఖ మంత్రి పదవిని అప్పగిస్తే బాగుంటుందని నేతలు భావిస్తున్నారట.
గడికోట శ్రీకాంత్ రెడ్డి బెంగుళూరు యూనివర్సిటీ లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి, విదేశాల్లో ఉన్నత ఉద్యోగం చేసి ప్రజా సేవలోకి వచ్చిన రోజు నుంచి నేటి వరకు వివాదాలకు దూరంగా ఉన్నాడు. రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ లేని అతి కొద్దిమందిలో గడికోట శ్రీకాంత్ రెడ్డి ఒకరు కావడం విశేషం. రాష్ట్రంలో ఎలాంటి పరిచయం అక్కరలేని కుటుంబం గడికోట కుటుంబం. అలానే ఆయన తండ్రి, పిన తండ్రి, సోదరుడు కూడా పలుసార్లు శాసనసభ్యులుగా చేశారు.
ఇది కూడా చదవండి : గౌతమ్ రెడ్డి మరణంతో ఆత్మకూరు నియోజకవర్గంలో ఉపఎన్నిక!
ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితులలో క్లీన్ మ్యాన్ గా గుర్తింపు ఉన్న గడికోట శ్రీకాంత్ రెడ్డి కి పరిశ్రమలు, ఐటీ మంత్రిత్వ బాధ్యతలు ఇస్తే రాష్ట్రానికి మంచి జరిగే అవకాశం ఉందని ప్రజలతో పాటు, ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి సీఎం జగన్ మనసులో ఏముందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సి ఉంటుంది. గడికోట శ్రీకాంత్ రెడ్డికి పరిశ్రమల శాఖను అప్పగించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.