కేంద్ర ప్రభుత్వం రైతులకు ఓ శుభవార్త తెలిపింది. ఖరీఫ్ పంటల మద్దతు ధరను పెంచుతూ కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన కేబినేట్ సమావేశంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దీనికి ఆమోదం తెలపడం విశేషం. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవబోతున్న తరుణంలో మోడీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. 2022-23 సంవత్సరానికి 17 రకాల ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెరగనుందని స్పష్టంగా అర్థమవుతోంది.
ఇప్పుడు పెంచబోయే కనీస మద్దతు ధర 20 శాతం పెరగవచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి. సోయాబీన్ క్వింటాల్ కు రూ.300 పెంచగా, వరికి మద్దతు ధర క్వింటాల్ కు రూ.100, కందులకు రూ.300, పెసర్లకు రూ.480, నువ్వులు రూ.523, పొద్దు తిరుగుడు పువ్వు రూ.385 పెంచినట్లుగా కేంద్రం తెలిపింది.
ఇది కూడా చదవండి: MLC Ramachandraiah: జగన్ పథకాలపై సొంత పార్టీ నేతల విమర్శలు.. ఎమ్మెల్సీ రామచంద్రయ్య వ్యాఖ్యలపై రచ్చ!ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ.. ఖరీఫ్, రబీ సీజన్లలో ఎరువుల అవసరాలు తీర్చడానికి భారతదేశంలో తగినంత యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర పెంచడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మోడీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.