కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కాసేపట్లో వెలువడనున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. దాంతో అభ్యర్థులను జారిపోకుండా చూసుకునేందుకు వారిని రిసార్ట్స్కు తరలించే ప్రయత్నాలు ప్రారంభించింది.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. పటిష్ట భద్రత మధ్య 36 కేంద్రాల్లో ఓట్లను లెక్కిస్తున్నారు. మే 13 శనివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు హడావుడి ప్రారంభం అయ్యింది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ సాధించి.. ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. మరో వైపు బీజేపీ కూడా గట్టి పోటీ ఇస్తోంది. జేడీఎస్ పూర్తిగా వెనకబడగా.. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ-బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ సాగుతోంది. ఇప్పటి వరకు వెల్లడించిన ఫలితాల్లో కాంగ్రెస్ 120కి స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ కూడా మంచి నంబర్ సీట్లు సాధించింది. దాంతో ప్రభుత్వం ఏర్పాటు కోసం బీజేపీ కూడా ప్రయత్నాలు చేస్తోంది. దాంతో మరోసారి కర్ణాటకలో రిసార్ట్ రాజకీయాలకు తెర తీశారు నేతలు.
ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ సాధించింది. మొత్తం 224 స్థానాలకు గాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 113 స్థానాల మ్యాజిక్ ఫిగర్ సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 120కి పైగా స్థానాల్లో విజయం సాధించింది. దాంతో గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ.. ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించింది. ఎమ్మెల్యేలను హోటల్స్, రిసార్ట్లకు తరలించే ప్రయత్నాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్.. అభ్యర్థులందరూ బెంగళూరుకు రావాలని ఆదేశించింది. రేపు మధ్యాహ్నం సీఎల్పీ సమావేశం జరిగే అవకాశముంది. సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
మరోవైపు బీజేపీ కూడా 70 కి పైగా స్థానాల్లో విజయం సాధించడంతో.. స్వతంత్ర అభ్యర్థులు, జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలోని రెబల్ నేతలను ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే జేడీఎస్ నేతలతో మంతనాలు ప్రారంభించి.. వారిని ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభించింది. 2018లో కూడా కర్ణాటకలో రిసార్ట్ రాజకీయాలు చోటు చేసుకున్నాయి. ఈ సారి కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తుండటంతో.. పార్టీలు.. అభ్యర్థులను కాపాడుకునేందుకు వారిని రిసార్ట్లకు, పొరుగు రాష్ట్రాల్లోని హోటల్స్కు తరలిస్తున్నారు. మరి కర్ణాటకలో ఎవరి వ్యూహాలు ఫలిస్తాయో.. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చూడాలి.