ప్రకాష్ రాజ్ ఓ కాలేజీకి ముఖ్య అతిథిగా వెళ్లారు. అయితే అక్కడ విద్యార్థులు ప్రకాష్ రాజ్ కూర్చున్న ప్రదేశంతో పాటు.. క్యాంపస్ మొత్తాన్ని ఆవు మూత్రంతో శుద్ధి చేశారు. అసలేం జరిగిందంటే?
ప్రకాష్ రాజ్ ఎంతటి విలక్షణమైన నటుడో అంతే విలక్షణమైన సంఘటన ఒకటి ప్రకాష్ రాజ్ విషయంలో జరిగింది. ప్రకాష్ రాజ్ కర్ణాటకకి చెందిన వ్యక్తి అనే విషయం చాలా మందికి తెలిసిందే. తన సొంత రాష్ట్రంలో ప్రకాష్ రాజ్ కి తన జీవితంలో మర్చిపోలేని సంఘటన ఒకటి ఎదురైంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రకాష్ రాజ్ కి ఒక చేదు అనుభవం అని చెప్పవచ్చు. కర్ణాటక శివమొగ్గ జిల్లా పరిధిలో ఉన్న భద్రావతిలో సర్ ఎం.విశ్వేశ్వరయ్య ఆర్ట్స్ అండ్ కామర్స్ అనే ఫేమస్ కాలేజీ ఒకటి వుంది. ఈ కాలేజ్ లోనే ప్రకాష్ రాజ్ కి అవమానం జరిగింది. కాలేజీ యాజమాన్యం కాలేజీలో ‘డైలాగ్ ఆన్ థియేటర్, సినిమా అండ్ సొసైటీ’ అనే అంశం మీద చర్చా గోష్టిని నిర్వహించింది.
కాలేజీ యాజమాన్యం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రకాష్ రాజ్ ని ఆహ్వానించడం జరిగింది. ప్రకాష్ రాజ్ పాల్గొన్నాడనే విషయం తెలుసుకున్న కొంతమంది విద్యార్థులు ప్రకాష్ రాజ్ ని కాలేజీకి ఎందుకు ఆహ్వానించారు. అసలు విద్యార్థులు లేకుండా బయట వ్యక్తులతో ప్రోగ్రాంని ఎలా నిర్వహిస్తారు అంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. కాలేజ్ లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు విద్యార్థులను నిలువరించడానికి బారికేడ్లు ఏర్పాటు చేసే దాకా వచ్చిందంటే పరిస్థితి ఎంతలా చేయి దాటిపోయిందో అర్థం చేసుకోవచ్చు విద్యార్థులతో పాటు స్థానిక బీజేపీ నాయకులు కూడా ప్రకాష్ రాజ్ విషయంలో పెద్ద ఎత్తున తమ నిరసన వ్యక్తం చేసారు.
అసలు కాలేజీ లో ప్రైవేట్ ఫంక్షన్ ని ఎలా నిర్వహిస్తారని.. కాలేజీ యాజమాన్య తీరుకి, ప్రకాష్ రాజ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. అనంతరం ప్రకాష్ రాజ్ కాలేజీ నుంచి వెళ్లిపోయిన తర్వాత విద్యార్థులు, బీజేపీ నాయకులు ప్రకాష్ రాజ్ కూర్చున్న ప్రాంతంతో పాటు కాలేజీ మొత్తాన్ని గో మూత్రంతో శుద్ధి చేశారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎన్నో సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రల్ని పోషించిన ప్రకాష్ రాజ్ కి ఇలాంటి అవమానం జరగటంతో ప్రకాష్ రాజ్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా విద్యార్థుల నిరసన కార్యక్రమంలో ఇతర వ్యక్తులు కూడా కలిసారని పోలీస్ ఉన్నతాధికారి అయిన డీజీపీ చెప్పారు. మరి ఈ ఘటనపై ఫైర్ బ్రాండ్ ప్రకాష్ రాజ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
Students ‘purify’ college with cow urine after actor Prakash Raj’s visit in Karnataka’s #Shivamogga.
Read: https://t.co/gD96Sc6SFR pic.twitter.com/hA2exgqxb3
— editorji (@editorji) August 9, 2023