ప్రతిపక్షం అంటే ప్రభుత్వం ఏ పని చేసినా విమర్శించడం, తప్పుబట్టడం కాదు. తప్పు చేసినప్పుడు తప్పు అని ఎంత నిజాయితీగా చెప్తారో, అలానే మంచి పనులు చేసినప్పుడు కూడా అంతే నిజాయితీగా శభాష్ అని మెచ్చుకునే గట్స్ ఉండాలి. అప్పుడే అది ప్రతిపక్షం అనిపించుకుంటుంది. ఒకప్పుడు ప్రతిపక్షం అంటే తప్పులను నిలదీయడం, మంచి పనులను ప్రశంసించడం చేసేవారు. కానీ రాను రాను రాజకీయాల్లోకి స్వార్ధం ప్రవేశించడంతో మంచి పనులు కూడా చెడుగానే కనిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం మీద అదే పనిగా బురద జల్లే ప్రయత్నం చేస్తుంటారు. కేవలం అధికారం కోసం చేసిన మంచి పనిని కూడా స్వాగతించరు. ఈ విషయంలో జనసేన పార్టీ భిన్నమనే చెప్పాలి.
విశాఖకు చెందిన జనసేన పార్టీ సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు. విశాఖ వేదికగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిస్తున్నట్లు జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. విశాఖపట్నం ఏయూ కన్వెన్షన్ సెంటర్లో పార్లే ఫర్ ది ఓషన్స్ సంస్థతో ఎంవోయు సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ బొలిశెట్టి సత్యనారాయణ ఒక ట్వీట్ చేశారు. “ఆంధ్రా సీఎం వైఎస్ జగన్ ప్లాస్టిక్ ఫ్లెక్సీ నిషేధాన్ని స్వాగతిద్దాం” అంటూ ట్వీట్ చేశారు. మరి ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిద్దామన్న జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన జనసేన పార్టీ సీనియర్ నేతపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.
ఆంధ్రా సీఎం @ysjagan ప్లాస్టిక్ ఫ్లెక్సీ నిషేధాన్ని స్వాగతిద్దాం@PawanKalyan గారి జన్మదనోత్సవంకి పెట్టే ప్లాస్టిక్ ఫ్లెక్సీ ఖర్చు #నా_సేన_కోసం_నా_వంతు అని 7288040505@icici లో సెప్టెంబర్ 2వ తేదీ లోగా జమచేసి జనసైనికుల వీర మహిళల సత్తా చాటుదాం!@JanaSenaParty#JSPForNewAgePolitics pic.twitter.com/tajFOTK2hG
— Bolisetty Satyanarayana (@bolisetti_satya) August 26, 2022