సినీ ఇండస్ట్రీ విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమా టికెట్ల ధరలు నిర్ణయిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓపై విమర్శలు రావడంతో.. సమస్య పరిష్కారం కోసం ఓ కమిటీని వేశారు. నేడు కమిటీ సూచనల మేరకు ఫిబ్రవరి 24న రావాల్సిన జీఓ మంత్రి గౌతమ్ రెడ్డి మృతి కారణంగా వాయిదా పడింది. అయితే పవన్ కల్యాణ్.. భీమ్లా నాయక్ సినిమాను దెబ్బ తీసేందుకు జీఓ విడుదలను ఆలస్యం చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు.
‘‘ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏ వ్యవస్థని వదలడం లేదు. చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నాడు. భీమ్లానాయక్ సినిమా విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తుంది. వ్యక్తులను టార్గెట్ గా పెట్టుకుని వ్యవస్థలను నాశనం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను. భారతీ సిమెంట్ రేటు పై లేని నియంత్రణ భీమ్లా నాయక్ సినిమా పై ఎందుకు? ప్రపంచ స్థాయికి వెళ్లిన తెలుగు సినిమాను తెలుగు రాష్ట్రంలో వేధిస్తున్న జగన్…తన మూర్ఖపు వైఖరి వీడాలి’’ అని చంద్రకబాబు డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి : భీమ్లా నాయక్ లో పవన్ పక్కన నటించిన ఈ అమ్మాయి ఎవరంటే?
‘‘రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలు అన్నీ పక్కన పెట్టి…థియేటర్ల దగ్గర రెవెన్యూ ఉద్యోగులను కాపలా పెట్టిన ప్రభుత్వ తీరు తీవ్ర అభ్యంతరకరం. ఉక్రెయిన్ లో చిక్కుకున్న తమ వారిని రక్షించేందుకు దేశంలో అన్ని రాష్ట్రాలు ప్రయత్నం చేస్తుంటే… ఆంధ్ర ప్రదేశ్ సిఎం మాత్రం భీమ్లా నాయక్ పై కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉన్నారు. తెలుగు దేశం తప్పును ఎప్పుడూ ప్రశ్నిస్తుంది… నిలదీస్తుంది. భీమ్లా నాయక్ విషయంలో వేధింపులు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాను’’ అని చంద్రబాబు నాయుడు వరుస ట్వీట్లు చేశారు. చంద్రబాబు నాయుడి విమర్శలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
వ్యక్తులను టార్గెట్ గా పెట్టుకుని వ్యవస్థలను నాశనం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను. భారతీ సిమెంట్ రేటు పై లేని నియంత్రణ #BheemlaNayak సినిమా పై ఎందుకు? ప్రపంచ స్థాయికి వెళ్లిన తెలుగు సినిమాను తెలుగు రాష్ట్రంలో వేధిస్తున్న జగన్…తన మూర్ఖపు వైఖరి వీడాలి.(2/4)
— N Chandrababu Naidu (@ncbn) February 25, 2022
ఆంధ్ర ప్రదేశ్ సిఎం మాత్రం భీమ్లా నాయక్ పై కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉన్నారు. తెలుగు దేశం తప్పును ఎప్పుడూ ప్రశ్నిస్తుంది…నిలదీస్తుంది. భీమ్లా నాయక్ విషయంలో వేధింపులు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.(4/4)
— N Chandrababu Naidu (@ncbn) February 25, 2022