నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు బండ్ల గణేష్.. తరుచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఆయన చాలా యాక్టీవ్గా ఉంటారు. పవన్ కళ్యాణ్ని ఎవరైనా ఏమైనా అంటే వెంటనే రంగంలోకి దిగి.. వారికి చుక్కలు చూపిస్తారు. వర్తమాన అంశంలపై కూడా తనదైన శైలీలో స్పందిస్తుంటారు. ఈ క్రమంలో ఆయన చేసే ట్వీట్లు కొన్నిసార్లు వివాదాలను క్రియేట్ చేస్తుంటాయి. కానీ బండ్ల గణేష్ మాత్రం తన తీరు మార్చుకోరు. తాజాగా జీవితా-రాజశేఖర్ దంపతులను టార్గెట్ చేశారు బండ్ల గణేష్. తాజాగా వారు బీజేపీలో చేరడంపై స్పందిస్తూ.. వ్యంగ్యంగా ట్వీట్ చేశారు బండ్ల గణేష్. ఆదర్శ దంపతులు అన్ని పార్టీలు మారారంటూ చేసిన ట్వీట్ ప్రసుత్తం వైరలవుతోంది. ఆ వివరాలు..
ప్రస్తుతం జీవితా-రాజశేఖర్ దంపతులు బీజేపీలో ఉన్నారు. ఈ క్రమంలో గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను అరెస్ట్ చేసి పాదయాత్రను అడ్డుకోవడంపై మండిపడుతూ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ నాయకురాలు జీవితా రాజశేఖర్ కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడ్డారు. కవిత, కేసీఆర్లపై సంచలన ఆరోపణలు చేశారు. సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఢిల్లీ లిక్కర్ స్కామ్లోనే కాక.. ఎన్నో కుంభకోణాల్లో వాటాలున్నాయంటూ జీవిత ఓ రేంజ్లో విమర్శలు చేశారు.
ఈ క్రమంలో బండ్ల గణేష్ జీవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. ‘‘లక్ష్మీపార్వతి పెట్టిన అన్న ఎన్టీఆర్ పార్టీ మర్చిపోయినట్టున్నారు.. మన రాష్ట్రంలో పార్టీ జెండాలు ఎన్ని ఉన్నాయో అన్ని జెండాలు మెడలో వేసుకున్నారు.. ఆదర్శ దంపతులు మీకో నమస్కారం’’ అంటూ ట్వీట్ చేశాడు. దీనితో పాటు జీవిత మాట్లాడిన వీడియోని షేర్ చేశాడు. ప్రస్తుతం బండ్ల గణేష్ చేసిన ట్వీట్ తెగ వైరలవుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
లక్ష్మీపార్వతి పెట్టిన అన్న ఎన్టీఆర్ పార్టీ మర్చిపోయినట్టున్నారు,, మన రాష్ట్రంలో పార్టీ జెండాలు ఎన్ని ఉన్నాయో అన్ని జెండాలు మెడలో వేసుకున్నారు,, ఆదర్శ దంపతులు 🙏 https://t.co/feRHGvh0Jx
— BANDLA GANESH. (@ganeshbandla) August 25, 2022