సాధారణంగా రాజకీయాల్లో ఎవరైనా మరణించి.. ఉప ఎన్నిక వస్తే.. మిగతా రాజకీయ పార్టీలు బరిలో నిలబడవు. చనిపోయిన నేత కుటుంబం మీద సానుభూతి చూపాలనే ఉద్దేశంతో పోటీకి దూరంగా ఉంటాయి. రాజకీయాల్లో ఇది సర్వసాధారణంగా కనిపించే ఓ సంప్రదాయం. అయితే తాను ఆ సంప్రదాయాన్ని పాటించనని.. ఆత్మకూరు ఉప ఎన్నికలో తప్పకుండా పోటీ చేస్తానని అంటున్నారు బిజివేముల రవీంద్రా రెడ్డి. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. రవీంద్రా రెడ్డి.. స్వయంగా మేకపాటి రాజమోహన్రెడ్డికి మేనల్లుడు కావడం గమనార్హం. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: గౌతమ్ రెడ్డి కుమార్తె చేసిన పనికి అంతా కన్నీరు
మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతితో ఆత్మకూరు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఆత్మకూరు టికెట్ని గౌతమ్ రెడ్డి భార్య శ్రీకీర్తి రెడ్డికి ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి మేనల్లుడు రవీంద్రా రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఆత్మకూరు నియోజకవర్గం నుంచి వచ్చే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించి.. మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు అభివృద్ధి కోసం పాటుపడతానని రవీంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం నెల్లూరులో ఒక హోటల్లో విలేకరులతో మాట్లాడారు.
ఇది కూడా చదవండి: గౌతమ్ రెడ్డి భార్యకు మంత్రి పదవి?…
‘‘మేకపాటి రాజమోహన్రెడ్డి మేనల్లుడైన నేను ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున తప్పకుండా పోటీ చేస్తాను. ఇప్పటికే నేను బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని కలిశాను. త్వరలో పార్టీలో చేరతానని తెలిపాను. ఒకవేళ బీజేపీ నేను పోటీ చేయడానికి అంగీకరించకపోతే.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతాను. ఉప ఎన్నికలను ఏకగ్రీవం కానివ్వను. మేకపాటి కుటుంబం నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నా ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి చేయలేదు. వీరిపై వ్యతిరేకత ఉంది. అందుకకే నేను వచ్చే ఉప ఎన్నికల్లో పోటీ చేసి తప్పకుండా విజయం సాధిస్తానని’’ రవీంద్రా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు ఆత్మకూరు ఉప ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని భావిస్తుండగా.. ఇక రవీంద్రా రెడ్డి ప్రకటనతో పోటీ తప్పదనే విషయం స్పష్టం అవుతుంది. దీనిపై మేకపాటి కుటుంబం ఎలా స్పందిస్తుందో చూడాలి. రవీంద్రా రెడ్డి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: మేకపాటి కుటుంబానికి సీఎం జగన్ అభయం! రంగంలోకి వారసుడు!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.