నేటి పోటీ ప్రపంచంలో ఒకరిని మించిన వారు మరొకరు ఉన్నారు. మంచి ఉద్యోగాలు పొందాలంటే మంచి విద్య అవసరం అని అంటారు. పదో తరగతి అనేది విద్యార్థి దశలో కీలకమైన మలుపు. ఈ కారణంతోనే పదవ తరగతి విద్యార్థులపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ద వహిస్తుంటారు. తమ పిల్లలు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని కోరుకుంటారు.
వీడో నీచమైన ప్రబుద్దుడు. పర్యాటక ప్రాంతాలు ఎక్కడున్నా అక్కడికి వెళ్లడం, ఏకాతంగా కలిసి ఉన్న లవ్ కపుల్స్ ని వీడియోలు, ఫోటోలు తీయడం చేస్తూ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నాడు. ఇలా ఎవరికీ తెలియకుండా వీడియోలు, ఫోటోలు తీసి లవ్ కపుల్స్ కు షాకిచ్చాడు. అయితే ఇటీవల గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్న ఈ ప్రబుద్దుడి మోసాలను కొందరు లవ్ కపుల్స్ పసిగట్టి చితకబాది పోలీసులకు అప్పగించారు తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. […]
మాయమైపోతున్నదమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు.. అని కవి అందెశ్రీ అన్నట్లు ఈ మద్య కొంతమంది మనుషులు పూర్తిగా మానత్వం మరచి ప్రవర్తిస్తున్నారు. సాధారణంగా ఆస్తుల కోసం అన్నదమ్ములు కొట్టుకోవడం, భూమి పంచాయితీలో అన్నదమ్ముల మధ్య తేడా వస్తే దాడులు చేసుకోవడం చూశాం. కానీ తమకు ఆస్తి పంచి ఇవ్వలేదని ఇద్దరు అన్నదమ్ములు అల్లారుముద్దుగా పెంచిన తండ్రిని దారుణంగా నరికి చంపిన ఘటన సూర్యాపేటలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా చెందిన 50సంవత్సరాల […]
సాధారణంగా రాజకీయాల్లో ఎవరైనా మరణించి.. ఉప ఎన్నిక వస్తే.. మిగతా రాజకీయ పార్టీలు బరిలో నిలబడవు. చనిపోయిన నేత కుటుంబం మీద సానుభూతి చూపాలనే ఉద్దేశంతో పోటీకి దూరంగా ఉంటాయి. రాజకీయాల్లో ఇది సర్వసాధారణంగా కనిపించే ఓ సంప్రదాయం. అయితే తాను ఆ సంప్రదాయాన్ని పాటించనని.. ఆత్మకూరు ఉప ఎన్నికలో తప్పకుండా పోటీ చేస్తానని అంటున్నారు బిజివేముల రవీంద్రా రెడ్డి. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. రవీంద్రా రెడ్డి.. స్వయంగా మేకపాటి రాజమోహన్రెడ్డికి మేనల్లుడు కావడం […]
త్వరలో ఏపీలో ఉప ఎన్నిక నగరా మోగనుంది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో ఆత్మకూరులో ఉప ఎన్నిక అనివార్యమైంది. అసెంబ్లీ అధికారులు ఇప్పటికే దీని గురించి ఎన్నికల కమిషన్ కు సమాచారం అందించారు. ఆత్మకూరు ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించారు. ఇక ఉప ఎన్నిక నేపథ్యంలో.. ఆత్మకూరు నుంచి వైసీపీ తరఫున గౌతమ్ రెడ్డి స్థానంలో.. ఆయన భార్య శ్రీకీర్తి రెడ్డి పోటీ చేస్తారని ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక ఈ ఉప […]
సారీ..మేము చనిపోతున్నాం..అందరూ జాగ్రత్తా. మమ్మల్నీ క్షమించాలి. విద్యార్థుల టీసీలు ఎంఈవో ఆఫీస్లో కలెక్ట్ చేసుకోండి. ఇక మాకు ఫీజులు రాక, అప్పులిచ్చిన వారు ఒత్తిడి చేయడంతో అవమానం భరించలేక ఇలా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తోంది. మాకు ఇప్పుడు చావే దిక్కు అంటూ హృదయ విదారకమైన భార్యభర్తల చివరి వీడియో. ఇక స్థానికుల సమాచారం ప్రకారం సుబ్రహ్మణ్యం, రోహిణి ఇద్దరు భార్యభర్తలు. వారు ప్రస్తుతం ఓ ప్రయివేట్ స్కూల్ను నడిపిస్తున్నారు. కరోనా కష్టకాలంలో స్కూల్ ఫీజులు వసూలు కాక, […]