మాయమైపోతున్నదమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు.. అని కవి అందెశ్రీ అన్నట్లు ఈ మద్య కొంతమంది మనుషులు పూర్తిగా మానత్వం మరచి ప్రవర్తిస్తున్నారు. సాధారణంగా ఆస్తుల కోసం అన్నదమ్ములు కొట్టుకోవడం, భూమి పంచాయితీలో అన్నదమ్ముల మధ్య తేడా వస్తే దాడులు చేసుకోవడం చూశాం. కానీ తమకు ఆస్తి పంచి ఇవ్వలేదని ఇద్దరు అన్నదమ్ములు అల్లారుముద్దుగా పెంచిన తండ్రిని దారుణంగా నరికి చంపిన ఘటన సూర్యాపేటలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..
సూర్యాపేట జిల్లా చెందిన 50సంవత్సరాల ఎరగాని శ్రీనివాస్గౌడ్ కి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది. శ్రీనివాస్ గౌడ్ కి గ్రామంలో కొంత భూమి ఉంది.. దాన్ని సేద్యం చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన కొడుకులు సంతూ, రాజశేఖర్ లు తమకు భూమి పంచి ఇవ్వాలని కొంత కాలంగా వత్తిడి చేస్తూ వస్తున్నారు. తమకు భూమి పంచి ఇవ్వడం లేదని అక్కసుతో గురువారం ఉదయం ఇద్దరు కొడుకు గొడ్డలితో తండ్రిని అత్యంత దారుణంగా నరికి చంపారు.
కంటికి రెప్పలా చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తండ్రిని కొడుకులు దుర్మార్గంగా హతమార్చడంతో శ్రీనివాస్గౌడ్ భార్య, కుమార్తె బోరున బోరున విలపిస్తున్నారు. ఇద్దరు కొడుకులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.