సారీ..మేము చనిపోతున్నాం..అందరూ జాగ్రత్తా. మమ్మల్నీ క్షమించాలి. విద్యార్థుల టీసీలు ఎంఈవో ఆఫీస్లో కలెక్ట్ చేసుకోండి. ఇక మాకు ఫీజులు రాక, అప్పులిచ్చిన వారు ఒత్తిడి చేయడంతో అవమానం భరించలేక ఇలా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తోంది. మాకు ఇప్పుడు చావే దిక్కు అంటూ హృదయ విదారకమైన భార్యభర్తల చివరి వీడియో.
ఇక స్థానికుల సమాచారం ప్రకారం సుబ్రహ్మణ్యం, రోహిణి ఇద్దరు భార్యభర్తలు. వారు ప్రస్తుతం ఓ ప్రయివేట్ స్కూల్ను నడిపిస్తున్నారు. కరోనా కష్టకాలంలో స్కూల్ ఫీజులు వసూలు కాక, బయట తెచ్చిన అప్పులు తిరిగి తీర్చలేక వారు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఈ అప్పులు ఎలా తీర్చాలా తెలియక వారు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
ఇక ఆత్మకూరు పట్టణానికి సమీపంలో కారులో చివరిగా వారు చనిపోయేమందుగా సెల్పీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇక స్కూల్ కోసం సుమారు రూ.2 కోట్ల వరకు అప్పుచేసి ఉంటారని స్థానికులు తెలియజేస్తున్నారు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.