వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి సూసైడ్ న్యూస్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిన విషయం విదితమే. ఈ ఘటనను మరువక ముందే ఇలాంటి మరో ఘోరం చోటుచేసుకుంది. మరో మెడికో సూసైడ్ చేసుకుంది.
తెలంగాణలో మరో వైద్య విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మెడికో ప్రీతి ఘటన మరువక ముందే ఖమ్మంలో ఇలాంటి మరో ఘటన చోటుచేసుకుంది. ఖమ్మంలోని మమతా మెడికల్ కళాశాలలో బీడీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న సముద్రాల మానస (22) అనే విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. కాలేజీకి దగ్గర్లోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న ఆమె నాలుగో ఫ్లోర్లోని గదిలో సాయంత్రం 5 గంటల సమయంలో ఒంటి మీద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. పోలీసులకు మిగిలిన విద్యార్థులు సమాచారం ఇచ్చారు. కానీ వాళ్లు వచ్చేటప్పటికి మానస 80 శాతం కాలిన గాయాలతో ప్రాణాలు కోల్పోయి కనిపించింది. దీంతో విద్యార్థిని మృతదేహాన్ని ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. మానస సూసైడ్ చేసుకున్న ప్లేసులో ఎలాంటి సూసైడ్ నోట్ కానీ.. ఫోన్ కానీ దొరకలేదు.
మానస ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలో ఏమీ దొరక్కపోవడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె కుటుంబీకులు ఇంకా ఘటనా స్థలానికి చేరుకోలేదు. వాళ్లు వచ్చిన తర్వాత ఏవైనా కారణాలు తెలిసే ఛాన్స్ ఉంది. మానస తండ్రి ఇటీవలే చనిపోయారు. అప్పటి నుంచి ఆమె సరిగ్గా ఉండట్లేదని.. మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడిందని తెలుస్తోంది. కాగా, మూడు వారాల కింద వరకు కాలేజీకి దగ్గర్లోని వసతి గృహంలో ఉన్న మానస.. ఇటీవలే కళాశాల గేటుకు పక్కనే ఉన్న హాస్టల్కు మారింది. ఆదివారం సాయంత్రం 4.30 గంటల టైమ్లో దగ్గర్లోని పెట్రోల్ బంక్కు వెళ్లిన ఆమె.. ఒక సీసాలో పెట్రోల్ పోయించుకొని వచ్చింది. ఆ తర్వాత హాస్టల్ రూమ్ తలుపులకు లోపల గడియ పెట్టుకొని నిప్పంటించుకొంది. రూమ్లో మంటలు ఎగిసిపడటంతో మిగతా గదుల్లోని విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు.