ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెల్లడవుతున్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఊహించిన షాక్ తగలగా.. తూర్పు రాయలసీమ ప్రాంతంలో.. మరీ ముఖ్యంగా కుప్పంలో వైసీపీ పుంజుకోవడంతో టీడీపీ శ్రేణులు షాకవుతున్నారు. ఆవివరాలు..
ఆంధప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ హీట్ పెంచాయి. మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 9 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసి ఘన విజయం సాధించింది. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో టీడీపీ భారీ ఆధ్యికంలో ముందంజంలో కొనసాగుతోంది. మరో చోట టీడీపీ-వైసీపీ మధ్య ఉత్కంఠభరిత పోరు నెలకొంది. గ్రాడ్యుయేట్ స్థానాల్లో.. టీడీపీ ముందంజలో ఉండటంతో.. జగన్ పాలనపై యువతలో ఎలాంటి అభిప్రాయం ఉందో చెప్పకనే చెప్పారు అంటూ టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇవే ఫలితాలు వస్తాయని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. టీడీపీ రెండు చోట్ల భారీ ఆధిక్యంలో ఉండటం చూసి వైసీపీ నేతలు షాక్ అవుతున్నారు. ఈ ఫలితాలు వారు ఊహించలేదు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ స్థానాల్లో టీడీపీ హవా కనిపిస్తుండగా.. పశ్చిమ రాయలసీమలో నువ్వా నేనా అన్నట్లు టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్య రవసత్తర పోటీ నడుస్తోంది. అయితే తూర్పు రాయలసీమ(ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు)లో టీడీపీ ముందంజంలో ఉన్నప్పటికి వైసీపీ నేతలు ఒక విషయంలో హ్యాపీగా ఉన్నారు. అదేంటంటే.. చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో వైసీపీకి అధిక ఓట్లు పోలయ్యాయి. చంద్రబాబుకు కంచుకోటలాంటి కుప్పంలో వైసీపీకి అధిక ఓట్లు రావడం కీలక పరిణామంగా భావిస్తున్నారు వైసీపీ నేతలు. జగన్ వ్యూహం ఇక్కడ ఫలించింది అంటున్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం సాధించి.. అధికారంలోకి రావాలన్నది ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం. అందులో తొలి టార్గెట్ సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు ఓటమి. ఇందుకోసం జగన్ ఏడాది క్రితం నుంచే అడుగులు వేయడం ప్రారంభించారు. దానిలో భాగంగా అనగా 2022, సెప్టెంబర్లో జగన్ తొలిసారి సీఎం హోదాలో కుప్పంలో పర్యటించారు. నియోజకవర్గ అభివృద్ధికి భారీ ఎత్తున నిధులు కేటాయించారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేశారు. అంతేకాక కుప్పంను రెవిన్యూ డివిజన్గా మార్చడానికి ప్రభుత్వం ఆమోద మూద్ర కూడా వేసింది.
వీటికి తోడు.. కుప్పం సభకు భారీగా జనం తరలి వచ్చి సభను జయప్రదం చేశారు. నాడు కుప్పం వేదికగా జగన్.. చంద్రబాబుని ఓడించాలని లక్ష్యంగా చేసుకున్నారు. అందుకు ఉపయోగ పడే అన్ని దారులను వినియోగించుకున్నారు. దాంతో చంద్రబాబును ఓడించే దిశగా జగన్ సఫలీకృతమవుతూ వస్తున్నారు. తాజాగా జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. కుప్పంలో నమోదైన ఓటింగ్ ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది అంటున్నారు వైసీపీ నేతలు.
అంతేకాక గతంలో జరిగిన స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. అప్పటి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలనే పట్టుదల వైసీపీలో పెరిగింది. దానికి తగ్గట్టుగానే జగన్ వ్యూహాలు సాగాయి. కుప్పంలో ఈ సారి గెలుపు పైన సీఎం జగన్ స్వయంగా ఫోకస్ పెట్టటంతో పార్టీ యంత్రాంగం అప్రమత్తమైంది. దాని ఎఫెక్ట్ తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనిపించింది అంటున్నారు వైసీపీ శ్రేణులు. ఇది ఇలానే కొనసాగితే.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో.. కుప్పంలో చంద్రబాబు ఓడిపోవడం ఖాయమని వైసీపీ కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి కుప్పంలో వైసీపీకి అధిక ఓట్లు పోలవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.