ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గన్నవరం పాలిటిక్స్ ఇంట్రస్టింగ్ గా మారాయి. ఇక్కడ టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. పార్టీకి, అధినేత చంద్రబాబు నాయుడికి పెద్ద తలనొప్పిగా మారారు. టీడీపీ తరఫున గెలిచిన వంశీ.. ఏకంగా అధికార పార్టీకి మద్దతు తెలుపుతూ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు. అవకాశం దొరికిన ప్రతి సారి చంద్రబాబు, టీడీపీ నేతలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో వంశీ దూకుడికి చెక్ పెట్టడమే కాక.. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీని కాపాడుకునేందకు చంద్రబాబు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారట. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని నేతను వంశీపై పోటీగా నిలబెట్టేందుకు తయారవుతున్నారట. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి : తారక్ కోసం తగ్గిన చంద్రబాబు! టీడీపీ మహానాడుకి జూనియర్ యన్టీఆర్!
వల్లభనేని వంశీ 2014,2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల ఫలితాల తరువాత వంశీ తన రూటు మార్చుకున్నారు. సొంత పార్టీని కాదని.. అధికార వైసీపీకి మద్దతు తెల్పుతూ టీడీపీకి చుక్కలు చూపిస్తున్నారు. వంశీ తిరగుబాటుతో.. టీడీపీ కంచుకోట గా ఉన్న గన్నవరంలో పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పిన తర్వాత.. గన్నవరంలో ఆ పార్టీకి ఇప్పటికి సరైన నాయకుడు దొరకలేదనే టాక్ బలంగా వినిపిస్తోంది. గన్నవరంలో టీడీపీకి బలమైన కేడర్ ఉన్నప్పటికి.. వారిని ముందుండి నడిపించే నాయకుడు కరువయ్యాడని కేడర్ భావిస్తోందట.వంశీ సమ ఉజ్జి కోసం అన్వేషణ..
వల్లభనేని వంశీ వైసీపీకి మద్దతు ప్రకటించిన తర్వాత గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడును నియోజకవర్గ ఇన్ఛార్జ్గా టీడీపీ అధిష్టానం నియమించింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన అర్జునుడుకి వల్లభనేని వంశీని తట్టుకునే శక్తి గానీ, చరిష్మా గానీ లేవని, గన్నవరం నియోజక వర్గంలో టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలో గన్నవరంలో వంశీకి పోటీ ఇచ్చేందుకు.. అతడికి సమ ఉజ్జి లాంటి బలమైన అభ్యర్థి కోసం టీడీపీ అధిష్టానం అన్వేషిస్తోంది. అంతేకాక రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఫైర్బ్రాండ్ వంశీని ఎదుర్కొనేందుకు, సామాజికంగా, ఆర్ధికంగా అన్ని విధాలుగా సమర్ధుడైన, ధీటైన అభ్యర్థి కోసం టీడీపీ అధిష్టానం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.
తెరపైకి గద్దె రామ్మోహన్ పేరు…ఇప్పటికే పలువురి నేతలు పేర్లు తెరపైకి వచ్చాయని తెలుస్తోంది. ఈ క్రమంలో వంశీని ఎదుర్కొగల సమర్థవంతమైన నాయకుడు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అనే టాక్ బలంగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో వంశీపై గద్దె రామ్మోహన్ పోటీ చేస్తారని టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని పార్టీ నేతలు బహిరంగంగా చెప్పకపోయినా, గద్దె రామ్మోహన్ పోటీ చేస్తే, అక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఎక్కువని, టీడీపీ తమ్ముళ్ళు భావిస్తున్నారట. ఇదే విషయాన్ని అధినేత చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు.. ఆయన కూడా ఈ అంశంలో సానుకూలంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి : ఈసారి కుప్పం నుండి పోటీ చేస్తే బాబుకి ఓటమి తప్పదా?
అయితే విజయవాడ తూర్పునియోజకవర్గంలో మంచి పట్టున్న గద్దె రామ్మోహన్ ఆ నియోజకవర్గాన్ని వదిలి.. గన్నవరం వెళ్తారా అనే ప్రశ్నలు కూడా తెరమీదకు వస్తున్నాయి. ఇదే నిజమయ్యి.. గద్దె రామ్మోహన్ గన్నవరం నుండి పోటీ చేసేందుకు విముఖత చూపితే.. అక్కడ అన్ని విధాలా బలంగా ఉన్న వల్లభనేని వంశీని ఓడించడం టీడీపీకి దాదాపు అసాధ్యం అనే అంటున్నారు విశ్లేషకులు. మరి వంశీకి చెక్ పెట్టేందేకు చంద్రబాబు నాయుడు ఎలాంటి వ్యూహాలు రచిస్తాడో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.