ప్రతీ ఏటా టాలీవుడ్కు బోలెడంత మంది కొత్త హీరోయిన్లు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. అందులో కృతి శెట్టి ఒకరు. ‘ఉప్పెన’తో తెలుగువారికి చేరువైన కన్నడ ముద్దుగుమ్మ కృతిశెట్టి. మొదటి సినిమాకే విపరీతమైన ఫ్యాన్ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ భామ ఇప్పుడు టాలీవుడ్లో బిజీ లేడీగా మారారు. హృతిక్రోషన్ కథానాయకుడిగా 2019లో విడుదలైన ‘సూపర్ 30’తో ఆమె తొలిసారి వెండితెరపై తళుక్కున మెరిశారు. ‘ఉప్పెన’ విజయం తర్వాత ఆమెకు టాలీవుడ్లో వరుస అవకాశాలు వరించాయి. కృతిశెట్టి యువ హీరోల ప్రాజెక్ట్లు ఓకే చేసినట్లు తెలుస్తోంది. అందులో ఒకటి నితిన్ ప్రాజెక్ట్ మరొకటి నాగార్జున ప్రధాన పాత్రలో నటించనున్న ‘బంగార్రాజు’. ఇందులో నాగచైతన్యకు జోడీగా కృతిశెట్టిని ఎంచుకున్నట్లు సమాచారం. నితిన్ హీరో వీఆర్ శేఖర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు ఇందులో కృతిశెట్టిని కథానాయికగా తీసుకున్నట్లు తెలుస్తోంది.
‘ఉప్పెన’లో రొమాంటిక్ సీన్స్, సెంటిమెంటల్ సీన్స్ ఇలా అన్ని కోణాల్లో ఆమె చూపించిన అభినయం, డైలాగ్ డెలివరీ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో కృతి శెట్టి డేట్స్ కోసం దర్శకనిర్మాతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెను ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా రానున్న కొత్త సినిమాలో హీరోయిన్గా తీసుకున్నారనేది లేటెస్ట్ టాక్. దీంతో పాటు కృతి శెట్టి, పోసాని సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కే సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే ఆసక్తికర టైటిల్ ను ఫిక్స్ చేసారు.
ఇపుడు భారీ ప్రాజెక్ట్లో ఈ భామకు హీరోయిన్ ఆఫర్ వచ్చిందట. ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి ఏకంగా రూ. కోటి డిమాండ్ చేసినట్టు సమాచారం. బాలీవుడ్లో ఈ భామ తెలుగులో హిట్టైన ‘ఉప్పెన’ హిందీ రీమేక్లో ఈ భామనే తీసుకోనున్నట్టు సమాచారం.