ప్రపంచంలో చాాలా ప్రాంతాల్లో వింత ఆచారాలు చోటుచేసుకుంటాయి. వాటిని సాంప్రదాయాలు, ఆచారాల ద్వారా వారి సంస్కృతిని కాపాడుకుంటారు. ఆఫ్రికాలోని ఓ గిరిజన తెగలో ఉన్న వింత ఆచారం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. పెళ్లి అయిన కొత్త దంపతులతోపాటుగా శోభనం గదిలో అత్తకూడా నిద్రిస్తుంది.
ప్రపంచంలో చాలా వింత వింత ఆచారాలు విని ఉంటాం. అవి విన్న వెంటనే చాలా ఆశ్చర్యమేస్తుంది. కొన్నిచోట్ల పురాతన ఆచారాలను ఇప్పటికీ కొనసాగిస్తుంటారు. అయితే కొన్ని తెగలలో సాంప్రదాయాలను, ఆచారాలను పాటిస్తూ వారి సంస్కృతిని కాపాడుకుంటూ ఉంటారు. ఆఫ్రికా ఖండంలోని ఓ తెగలో వింత ఆచారం కొనసాగిస్తున్నారు. అది పెళ్లి అయిన కొత్తజంటతో మొదటి రాత్రి పెళ్ళికూతురు తల్లి కూడా గదిలో ఉండాలనే ఆచారం ఉంది. అదేంటో పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రపంచంలో పురాతన ఆచారాలకు నిలయం ఆఫ్రికా ఖండం. ఇక్కడ చాలా పురాతన ఆచారాలను పాటిస్తారు. ఓ గిరిజన తెగలో వింతైన సాంప్రదాయం ఉంది. పెళ్లి అనేది సమాజంలో నలుగురిలో జరిగే తంతు. పెళ్లి వేడుక అందిరితో సందడిగా చేసుకుంటాం. పెళ్లి తర్వాత అయ్యే కార్యక్రమం శోభనం. ఇది భార్యాభర్తలు నాలుగు గోడల మధ్య జరిగే కార్యక్రమం. కానీ ఈ గిరిజన తెగలో ఫస్ట్ నైట్ నూతన దంపతులతో పాటు పెళ్ళికూతురు తల్లి కూడా అదే గదిలో నిద్రిస్తుంది. ఒకవేళ తల్లి లేని పక్షంలో ఆమె స్థానంలో ఓ వృద్ధ మహిళ అయినా సరే వారితో నిద్రించాలి. తల్లి వైవాహిక జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని కొత్తజంటకు వివరిస్తుంది. కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభించాలనే విషయాన్ని చెబుతుంది. భార్యాభర్తలిద్దరు గొడవలకు పోకుండా అన్యోన్యంగా ఉండాలని వారికి చెబుతుంది. పూర్వకాలంలో ఓ వృద్ధ మహిళ ఈ ఆచారాన్ని ప్రారంభించిందట దానినే ఇప్పటివరకు కొనసాగిస్తున్నారు. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి.