వాతావరణంలో వస్తున్న మార్పులు భౌగోళికంగా పెను సవాళ్లకు దారితీస్తుంది. భూమిపై అనేక మార్పులు చోటుచేసుకుంటూ భూమి రెండుగా చీలిపోతుంది. భవిష్యత్తులో మరో ఖండం ఏర్పడుతందని సైంటిస్టులు తెలుపుతున్నారు.
ప్రకృతివైపరీత్యాలు సంబవించినప్పుడు భూమిపై అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఆకాస్మాత్తుగా ఏర్పడే భూకంపాలతో భూగర్భంలో చోటుచేసుకున్న మార్పుల వల్ల భూ ఉపరితలంపై పగుళ్లు ఏర్పడతాయి. దీని వల్ల భారీగా ఆస్థి, ప్రాణ నష్టాలు చోటుచేసుకుంటాయి. కొన్ని లక్షల ఏళ్ల క్రితం భూగర్భంలో చోటు చేసుకున్న మార్పులతో భూమి ఏడు ఖండాలుగా విడిపోయింది. ఇప్పుడు అందులోని ఓ ఖండంలో భూమి కిలోమీటర్ల మేర చీలిపోతుంది. భవిష్యత్తులో మరో ఖండం ఉద్భవించనుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూమిపై మరో ప్రళయం రాబోతుందా అన్న ఆందోళనలు వెలువడుతున్నాయి. దీనిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తున్నారు.
కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ప్రకృతిలో జరిగిన మార్పులు, భూమిలో ఏర్పడ్డ పగుళ్లు దీర్ఘకాలంలో అనేక మార్పులు చెంది ఆసియా, ఆఫ్రికా, అంటార్కిటికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ అనే ఏడు ఖండాలుగా భూమి విడిపోయింది. అయితే మూడు నెలల క్రితం ఆఫ్రికాలో భూమిలో చీలికలు ఏర్పడ్డాయి. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆ చీలికలు 56 కిలోమీటర్ల మేర విస్తరించి మరో ప్రళయానికి దారితీస్తుందా అనే భయాలను కలుగజేస్తుంది. దీనిపై భూగర్భ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.
ఆ చీలికలు అలాగే విస్తరిస్తూ పోతే భవిష్యత్తులో ఆఫ్రికా రెండు భాగాలుగా విడిపోయి మరో కొత్త ఖండం ఏర్పడనుందని కథనాలు వెలువడుతున్నాయి. దీని గురించి లోతుగా తెలుసుకునేందుకు టెక్టోనిక్ ప్లేట్ ను అధ్యయనం చేస్తున్నారు. భూగర్భంలోని టెక్టోనిక్ ప్లేట్ రెండుగా విడిపోయి కదలికలు ప్రారంభమైనప్పుడు భూగర్బంలో పగుళ్లు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ఆఫ్రికాలోని భూమి చీలికకు ఇదే కారణమని భూగర్భ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఆ చీలికలు ప్రస్తుతం నెమ్మదిగా విస్తరిస్తున్నాయని భవిష్యత్తులో పెను ప్రమాదం సంభవించబోతుందని సైంటిస్టులు తెలుపుతున్నారు.