పేరు,డబ్బు సంపాదించుకునేందుకు అమ్మాయిలు సినీ పరిశ్రమకు వస్తూ ఉంటారు. కమిట్ మెంట్స్, ఇతర మోసాలకు లోను కావాల్సి వస్తుందన్న వార్తలు విని ఉండటం వల్ల భయపడుతూనే ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు.
పేరు,డబ్బు సంపాదించుకునేందుకు అమ్మాయిలు సినీ పరిశ్రమకు వస్తూ ఉంటారు. కమిట్ మెంట్స్, ఇతర మోసాలకు లోను కావాల్సి వస్తుందన్న వార్తలు విని ఉండటం వల్ల భయపడుతూనే ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. అయితే అవకాశాలతో పాటు కాస్తంత అదృష్టం ఉన్న అమ్మాయిలు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్లుగా మారిపోయి.. దశాబ్దాల పాటు కొనసాగుతున్నారు. మరికొంత మంది చిన్న క్యారెక్టర్లతో సరిపెట్టుకుంటున్నారు. అయితే ఇంకొంత మంది తిరిగి ఇంటి మొహం చూడలేక.. చెప్పుడు మాటలతో వ్యభిచార గృహంలోకి నెట్టబడుతున్నారు. అవకాశాల ఇప్పిస్తామని మభ్యపెట్టి వారిపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు దుర్మార్గులు. ఇదే జరిగింది ఓ నటి విషయంలో.
సినిమా అవకాశాలు ఇప్పిస్తానంటూ ఇంటర్వ్యూకి పిలిచి ఓ నటిపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఆమె స్నేహితుడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రకారం..గురుగ్రామ్లోని చక్కార్ పూర్ గ్రామానికి చెందిన మహేశ్ పాండే అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ ద్వారా గత నెల 20 పరిచయం అయ్యాడు. భోజ్పురి చిత్ర పరిశ్రమలో అవకాశాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. దీంతో తన ఫోన్ నంబర్ ఇచ్చాను. ఈ నెల 29న ఇంటర్వ్యూ ఉందని.. రావాలని గురుగ్రామ్లోని ఉద్యోగ్ విహార్ ప్రాంతంలోని హాటల్కు పిలిచాడు. అప్పటికే రూమ్ బుక్ చేసి ఉండటంతో అక్కడకు వెళ్లగా.. కొన్ని ప్రశ్నలు వేసినట్లే వేసి.. మద్యం సేవించడం మొదలుపెట్టాడు.
అంతలో ఇప్పడు బెడ్ పై ఇంటర్వ్యూ జరుగుతుందని చెప్పి..తనను బలవంతంగా బెడ్ పైకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తాను ప్రతిఘటించినప్పటికీ లాభం లేదని తెలిపింది. ఈ విషయాన్ని ఎక్కడైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. అత్యాచారం అనంతరం అక్కడి నుండి పారిపోయాడు. అతడి స్నేహితులు ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించడంతో ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదని తెలిపింది. 29న అత్యాచారం జరగ్గా.. ఆమె ఈ నెల 19న పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు హోటల్ సీసీటివీ ఫుటేజ్ పరిశీలించి, నిందితున్ని గుర్తించారు. కేసు నమోదు చేశామని, తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.