ఒక ఆలయంలో వింత ఘటన జరిగింది. చేతికి పాము చుట్టుకున్నా ఓ మహిళ భక్తిపారవశ్యంతో చిందులు వేసింది. ఆ తర్వాత ఏమైందంటే..!
దేవుడి మీద భక్తి ఉండాలి. కానీ అతిభక్తి ఉండకూడదు. దేవుడి పేరుతో గుడ్డినమ్మకాలు పెట్టుకోకూడాదు. భక్తి పేరుతో కొందరు మూఢనమ్మకాలను ప్రచారం చేయడం, అమాయకుల మోసం చేయడం చూస్తూనే ఉన్నాం. అంధవిశ్వాసాలు, మూఢ నమ్మకాలతో చాలా మంది తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇదిలాఉండగా.. తాజాగా మహారాష్ట్ర-మధ్యప్రదేశ్ సరిహద్దులోని ఒక గ్రామంలో జరిగిన ఆసక్తికర ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చిన్ద్వారా జిల్లా, జామ్ సవాలీ హనుమాన్ ఆలయం.. ఆ ఏరియాలో బాగా ఫేమస్. ఆ గుడిలో స్వామివారి విగ్రహం నిద్రించే భంగిమలో ఉంటుంది. అయితే.. తాజాగా హోలీ పండుగ సందర్భంగా ఈ గుడిలో ఓ ఘటన చోటుచేసుకుంది.
హారతి సమయంలో భక్తులు హనుమాన్ చాలీసా పఠిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ ఓ నాగుపాము ఒక భక్తురాలి చేతికి చుట్టుకుంది. అయితే ఆమె మాత్రం బెదరలేదు. పైగా ఆ పాము అలా ఉండగానే భక్తిపారవశ్యంతో పూనకం వచ్చినట్లు ఊగిపోతూ చిందులేసింది. అది చూసి కొందరు భయంతో దూరంగా జరిగారు. మరికొందరు జై హనుమాన్ అంటూ నినాదాలతో ఊగిపోయారు. ఆ పాము కూడా ఆమెను ఏమీ చేయలేదు. కొద్దిసేపటి తర్వాత చేతి నుంచి దిగి బయటకు వెళ్లిపోయింది. ఈ గుడిలో ఇలాంటి మహిమలు జరుగుతుంటాయని.. అంతా స్వామివారి మహిమేనని ఆలయ ప్రధాన అర్చకుడు చెప్పారు. మరి.. ఈ ఘటన మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
महाराष्ट्र, मध्य प्रदेश के बॉर्डर पर स्थित सौंसर के जामसवली मंदिर में कोबरा प्रजाति का सांप हाथो मे लेकर महाआरती करती महीला, pic.twitter.com/5wNBiHAvPX
— Yogendraindiatv (@indiatvyogendra) March 9, 2023