రజనీకాంత్ గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో రజినీ మక్కల్ మండ్రం పార్టీపై ప్రకటన చేశారు. వాస్తవానికి సమయానికి తగినట్టు పరిపాలన సాగడం లేదని అభిప్రాయ పడ్డారు. అందుకే సమస్యలు వస్తున్నాయని అన్నీ వ్యవస్థలు సమపాలంగా పనిచేస్తే ఇబ్బందులు ఎందుకు వస్తాయని ఆయన ప్రశ్నించారు. బడుగు, బలహీనవర్గాల సమస్యల కోసం పనిచేస్తామని తేల్చిచెప్పారు. అయితే వనరుల దుర్వినియోగం మాత్రం చేయబోమని, ఆ మాటే తన పార్టీలో ఉండబోదని చెప్పారు. కానీ సడెన్గా ఆరోగ్యం దెబ్బ తినడంతో చివరి వారంలో వెనక్కి తగ్గారు. మొత్తానికి రాజకీయాల్లోకి రాలేనని, ఆరోగ్యం బాగా లేనందున ఇలాంటి పరిస్థితిలో వచ్చి తాను ఎవ్వరినీ ఇబ్బంది పెట్టదలుచుకోలేదని చెప్పుకొచ్చారు. నేడు రజినీ రాజకీయ ప్రవేశం గురించి చర్చలు మొదలయ్యాయి. దీంతో రజినీ తన పార్టీని పూర్తిగా రద్దు చేస్తున్నానని, రజినీ మక్కల్ మండ్రం అనేది ఇకపై కేవలం అభిమాన సంక్షేమ సంఘంగానే ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వెళ్లను అని స్ఫష్టం చేశారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం ఎన్నో దశాబ్దాల నుంచి నానుతూ వస్తోన్న వ్యవహారం. దాదాపు 90వ దశకం నుంచి రజినీ రాజకీయ ఎంట్రీపై రకరకాల కామెంట్లు వినిపిస్తూ వచ్చాయి. తన సినిమాల్లోనూ పొలిటికల్ డైలాగ్లు ఎక్కువగానే వినిపిస్తూ వచ్చాయి. అందులోనూ తాను ఇప్పుడే రానని, ఆసక్తి లేదన్నట్టుగానే డైలాగ్లు పేల్చేవారు. జయలలిత మరణంతో తమిళనాడులో రాజకీయ స్తబ్దత ఏర్పడింది. సరైన సమయం అని అనుకున్న రజినీ రాజకీయాల వైపు అడుగులువేయడం ప్రారంభించారు.
ఆరోగ్యం దెబ్బ తినడంతో రాజకీయాల్లో లేకుండానే తాను ప్రజలకు సేవ చేస్తానని, తన నిర్ణయం తన అభిమానులకు బాధ కలిగించినా తప్పనిసరి పరిస్థితుల్లో తాను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, దయచేసి అందరూ తనను క్షమించాలని రజనీకాంత్ ప్రకటన చేశారు. రజినీ తన పార్టీని పూర్తిగా రద్దు చేస్తున్నానని, ఇకపై కేవలం అభిమాన సంక్షేమ సంఘంగానే ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో రాజకీయాల జోలికెళ్లను అని స్పష్టం చేసినట్లు సమాచారం.