ఏడాదిలో మహా ప్రధానమైన పర్వదినం ఇది. మహాగణపతి పార్వతీ తనయుడుగా ఆవిర్భవించిన రోజు. మధ్యాహ్నం చవితి ఉన్న రోజునే ‘వినాయక చవితి’ జరుపుకోవాలి. శాస్త్రోక్తంగా గణపతి ప్రతిమను బంగారంతోగానీ, వెండితోగానీ, రాగితోగానీ, మట్టితోగానీ, ఏమీ లేకపోతే తమలపాకు మీద పసుపుతో వినాయకుడిని చేసినది అర్చించాలి. దూర్వాలు, బిల్వాలు(మారేడు) గణపతికి ప్రీతికరాలు. కనుక వాటితో అర్చించాలి. అవికాక శాస్త్రంలో చెప్పబడిన 21పత్రాలతో పూజించాలి. ఇవన్నీ ఒషధీయ విలువలున్న పత్రాలు. ఇంటిల్లిపాదీ, ఊరూ వాడా పూజించుకునే పర్వమిది. కొన్నిచోట్ల నవరాత్రులు […]
నాలుగో శ్రావణ శుక్రవారం. పెళ్లైన మహిళలు చాలా ఇష్టంగా జరుపుకునే పండగలు, శుభకార్యాలకు ఈ నెల చాలా ప్రాముఖ్యం. శ్రావణ మాసం అంటేనా అందరికీ ముందుగా గుర్తుకొచ్ఛేది. “వరలక్ష్మీ వ్రతం”. ఈ వరలక్ష్మీ వ్రతం తరువాత శ్రావణ మాసంలో మహిళలు ఆచరించే మరో ప్రధాన వ్రతం “మంగళ గౌరీ వ్రతం”. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజున లేదా ప్రతి శుక్రవారం నాడు మహిళలు నిష్ఠతో మహాలక్ష్మిని పూజిస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయని విశ్వాసం. ఉపవాసం మొదలు పూజలు […]
పంచముఖ హనుమాన్ బొమ్మను మీ ఇంట్లో ఉంచితే కలిగే ఫలితాలు. హనుమంతుడు శ్రీరాముడికి పరమభక్తుడు, హనుమంతుడు భక్త సులభుడు, అంజనీ సుతుడి కరుణాకటాక్షాలు కలగాలంటే శ్రీరాముడిని పూజించి భజన చేస్తే చాలు భజన చేస్తున్న ప్రదేశంలో హనుమంతుడు ఏదో ఒక అవతారంలో ఉంటాడు అని అని చెప్తుంటారు.’యత్ర యత్ర రఘునాథ కీర్తనంతత్ర తత్ర కృతమస్తకాంజలిం… భాస్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమతః రాక్షసాంతకం… అని అందుకే అంటారు. శ్రీ మారుతి కృప ఉంటే ఎంతటి జటిలమైన సమస్య […]
లక్ష్మీదేవి 8 అవతారాలతో దర్శనం ఇస్తుంది. అష్టలక్ష్మి అన్నమాట ఇటీవల కాలంలో సుప్రసిద్ధంగా వినబడుతోంది. ఈ అష్టలక్ష్ములలో ఒకటి గజలక్ష్మి. తామర పువ్వులో పద్మాసనం మీద కూచుంటుంది గజలక్ష్మి. ఈమెకు ఇరుపక్కలా రెండు ఏనుగులు ఉంటాయి. ఆమె కూచునే భంగిమలోనే యోగముద్ర ఉంది. ఆమెకు నాలుగు చేతులు ఉంటాయి. పై చేతులలో తామర పువ్వులు ఉంటాయి. కింది చేతులు అభయ, వరద ముద్రలు చూపెడుతుంటాయి. లక్ష్మీదేవి సమృద్ధికి, సంపదకు, అదృష్టానికి, గౌరవానికి, దర్జాకు, దర్పానికి సంకేతం. ఆమె […]
సకలదేవతలకు ప్రీతికరమైనది శ్రావణమాసం. ప్రతిరోజూ పండుగలా ఆడపడుచులు సంతోషంగా ఉండే మాసం. కలియుగదైవం శ్రీవేంకటేశ్వరుడు జన్మించిన శ్రవణ నక్షత్రం పేరుతో వచ్చే ఈ మాసమంటే శ్రీమహావిష్ణువుకి ఎంతో ఇష్టం. వరలక్ష్మి, గౌరీ, సుబ్రమణ్య, రాఘవేంద్ర , వృషభాది దేవతలకు కూడా అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వాటి వైశిష్ట్యం చాలా ఉంది. లక్ష్మీ దేవికి ఇష్టమైన ఈ నెలలో రోజూ ఉదయం, సాయంత్రం మహిళలు దీపారాధన చేస్తే దీర్ఘసుమంగళీయోగం, అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్ముతారు. […]
రాఖీ అంటే రక్ష. రాఖీ కట్టడం వల్ల సోదరుడి రక్ష. ఎల్లవేళలా అక్కా, చెల్లెళ్లపై ఉంటుందని నమ్మకం. చిన్న దారం కట్టడంతో సోదర సంబంధం జన్మజన్మలా పెనవేసుకుపోతుందని సోదరీమణులను కంటికి రెప్పలా అన్నాతమ్ముళ్లు కాపాడుకుంటారని నమ్మకం. మహాభారతంలో ద్రౌపది, శ్రీకృష్ణుల అన్నాచెల్లెళ్ల అనుబంధం గొప్పది.శ్రావణ పూర్ణిమ అంటే “రక్ష” కట్టుకోవడం ఒకటే కాదు దానితో పాటు సర్వవిద్యా స్వరూపుడైన భగవంతుని హయగ్రీవ అవతారం జరిగింది ఈ శ్రావణ పూర్ణిమ రోజే. శ్రావణ పూర్ణిమనే ‘రాఖీ పౌర్ణమి‘, ‘జంధ్యాల […]
గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరుచుకుని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు. తర తరాలకూ కొనసాగవచ్చు. హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తుంటారు. ఆషాఢ శుద్ధపౌర్ణమిని ‘గురు పౌర్ణమి’ లేదా ‘వ్యాస పౌర్ణమి’ అని అంటారు. ఇదే రోజు వ్యాస ముహాముని జన్మతిథి కావున మహాపర్వదినంగా అనాది కాలం నుంచీ భావిస్తున్నారు. గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. […]
రజనీకాంత్ గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో రజినీ మక్కల్ మండ్రం పార్టీపై ప్రకటన చేశారు. వాస్తవానికి సమయానికి తగినట్టు పరిపాలన సాగడం లేదని అభిప్రాయ పడ్డారు. అందుకే సమస్యలు వస్తున్నాయని అన్నీ వ్యవస్థలు సమపాలంగా పనిచేస్తే ఇబ్బందులు ఎందుకు వస్తాయని ఆయన ప్రశ్నించారు. బడుగు, బలహీనవర్గాల సమస్యల కోసం పనిచేస్తామని తేల్చిచెప్పారు. అయితే వనరుల దుర్వినియోగం మాత్రం చేయబోమని, ఆ మాటే తన పార్టీలో ఉండబోదని చెప్పారు. కానీ సడెన్గా ఆరోగ్యం దెబ్బ తినడంతో చివరి […]
సాధారణంగా శనిదోషం అనేది అన్నిటికంటే పెద్దదైన దోషంగా అందరూ భావిస్తూ ఉంటారు. ఒక రోజున తన ప్రభావం ఎలా ఉంటుందో చూపించి రెండో రోజున వదిలేస్తే ఇంతగా శనిదేవుడికి ఎవరూ భయపడుతూ ఉండేవాళ్లు కాదు. ఏడేళ్ల పాటు ఏకధాటిగా ఆయన ఇబ్బందులు పెడుతూనే ఉంటాడు కాబట్టి అంతా హడలెత్తి పోతుంటారు. శనిదేవుడి ప్రభావం నుంచి సాధ్యమైనంత తొందరగా బయటపడటానికి శనివారంతో కూడిన త్రయోదశి రోజున శనిదేవుడిని పూజిస్తూ ఉంటారు. శని త్రయోదశి రోజున ఆయన అనుగ్రహం సంపాదించడం […]
చేతులు కట్టుకుని నిలుచున్న వ్యక్తి పేరు – సాల్వటోర్ గారౌ . శిల్పం ఖరీదు రూ. 13 లక్షలు. శిల్పమేదీ అనుకుంటున్నారా అతను శూన్యాన్నే అమ్మాడు. నిజమే ఇక్కడ శిల్పం లేదు. ఎందుకంటే అది అదృశ్య శిల్పం! అయితే దానికి ధర అతని మాటలవల్ల వచ్చింది. ఇటలీకి చెందిన సాల్వటోర్ గారౌ 150 సెం.మీ వెడల్పు, 150 సెం.మీ పొడవు ఉండే ఓ రాతిని ‘నేను’ అనే శిల్పంగా అభివర్ణించాడు. దేవుడికి రూపం లేన ట్లుగానే మనిషికి, […]