రాఖీ అంటే రక్ష. రాఖీ కట్టడం వల్ల సోదరుడి రక్ష. ఎల్లవేళలా అక్కా, చెల్లెళ్లపై ఉంటుందని నమ్మకం. చిన్న దారం కట్టడంతో సోదర సంబంధం జన్మజన్మలా పెనవేసుకుపోతుందని సోదరీమణులను కంటికి రెప్పలా అన్నాతమ్ముళ్లు కాపాడుకుంటారని నమ్మకం. మహాభారతంలో ద్రౌపది, శ్రీకృష్ణుల అన్నాచెల్లెళ్ల అనుబంధం గొప్పది.శ్రావణ పూర్ణిమ అంటే “రక్ష” కట్టుకోవడం ఒకటే కాదు దానితో పాటు సర్వవిద్యా స్వరూపుడైన భగవంతుని హయగ్రీవ అవతారం జరిగింది ఈ శ్రావణ పూర్ణిమ రోజే. శ్రావణ పూర్ణిమనే ‘రాఖీ పౌర్ణమి‘, ‘జంధ్యాల పౌర్ణమి‘ పేర్లతో పిలుస్తారు. వాస్తవానికి భారతదేశంలో రాఖీపౌర్ణమి లేదా రక్షాబంధన్ ఎపుడు ప్రారంభమైందో, ఎలా ప్రారంభమైందో తెలిపే నిర్దిష్ట సాక్ష్యాలు లేవు. కానీ, పురాణాలలో మాత్రం దీనిపై వివిధ రకాల కథలు ఉన్నాయి. వృతాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఇంద్రుడు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు తన భర్తకు విజయం చేకూరాలని కోరుతూ ఇంద్రుని భార్య శచీదేవి ఓ పవిత్రమైన దారాన్ని మంత్రించి అతడి కుడిచేతి మణికట్టుకి కట్టింది. దీంతో ఆయన రాక్షసులను ఓడించి, విజయం సాధించారని అలా రాఖీ పుట్టిందని చెబుతారు.
అలెగ్జాండర్ భార్య ‘రోక్సానా’ తక్షశిల రాజు పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది. అలెగ్జాండర్ భార్య రోక్సానా ఆయనను తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. యుద్ధంలో తన భర్త అలెగ్జాండర్ ఓడిపోతే చంపవద్దని కోరుతుంది. దీంతో అలెగ్జాండర్ను చంపే అవకాశం చిక్కినా తన చేతికున్న రాఖీచూసి పురుషోత్తముడు విరమించుకున్నాడు.
అన్నా చెల్లెళ్ళు , అక్కా తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ. ఈ రోజున సోదరీమణులు తన సోదరుల చేతికి రాఖీని కడతారు. వారిని ఎల్లప్పుడూ రక్షించి ఆదుకుంటానని బహుమతి రూపంలో హామి ఇస్తారు. శాస్త్రాల ప్రకారం పౌర్ణమి లక్ష్మీ దేవికి సంబంధించింది.
ఈ రోజున లక్ష్మీ నారాయణుడిని పూజిస్తే మీకు సంపద, ఆరోగ్యం పెరుగుతుంది. అంతేకాకుండా కనకధార స్తోత్రం, విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం ద్వారా లక్ష్మీ దేవి, శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందుతారు. ఫలితంగా ఇంట్లో సిరి, సంపదలు పొంగిపొర్లుతాయి.
మరిన్ని ఆధ్యాత్మిక విషయాలకోసం ఈ వీడియో వీక్షించండి: