ఈ ఏడాది మనం శోభ కృత్ నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ముఖ్యంగా కన్యరాశి జాతకం ఈ ఏడాది ఎలా ఉంది? జ్యోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పడు తెలుసుకుందాం.
ఉగాది పండుగను ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకుంటుంటారు. మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు మాత్రం ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. పాశ్చత్య దేశాలు జనవరి 1న ఎంతో ఘనంగా జరుపుకుంటే.. మన తెలుగు వాళ్లు మాత్రం నూతన సంవత్సరంగా ఉగాదిని భావిస్తూ ఈ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది మనం శోభ కృత్ నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ సందర్భంగా వివిధ రాశుల వారి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మరీ ముఖ్యంగా కన్యరాశి వారికి ఈ ఏడాది ఎలా ఉందో తెలుసుకుందాం.
శోభ కృత్ నామ సంవత్సరంలో కన్యరాశి జాతకం:
ఈ సంవత్సరంలో టాప్ నెంబర్ లో ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా కన్య రాశి వారేనని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. వీరికి గురుగ్రహం, శనిగ్రహం రెండూ బాగానే ఉన్నాయి. మధ్య మధ్యలో సూర్యుడు, శుక్రుడు అనుకూలిస్తాడు. మరీ ముఖ్యంగా కన్యరాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలంగా ఉందని, ఈ రాశి వారు దీనిని అద్భుతంగా భావించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎక్కువగా ప్రయాణాలు చేయాలి, కొత్త కొత్త వ్యక్తులను కలవాలి. మీకు అవసరం ఉన్నా లేకున్న పుస్తకాలు చదవండి. ఈ రాశుల వారు ఈ ఏడాది పెళ్లి చేసుకుంటే మంచి భాగస్వామి భార్యగా వస్తుంది. 6వ స్థానంలో శని గ్రహం ఉంది కాబట్టి.. పంతాలు పట్టింపులు విడిచి మీకు శత్రువులు ఎవరైనా ఉంటే వారి ఇంటికి వెళ్లి కిలో స్వీట్స్ ఇచ్చి వారి నోరు తీపి చేయండి.
ఈ కన్యరాశి వారు ఇక నుంచి అందరితో కలిసి మెలిసి సంతోషంగా ఉండండి. మీ స్నేహితుతో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏడాది భద్రపద మాసంలో మీకు నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది. ఈ మాసం ఈ రాశుల వారు సైలెంట్ గా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా ఈ రాశుల వారి ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రాశుల వారు ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించాలి. ఈ మాసంలో మీరు అస్సలు ఆస్తులు అమ్మకపోవడం మంచిదని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ రాశి వారికి మొహమాటం ఎక్కువగా ఉంటుంది. దీనికి భయపడి ఎవరూ కూడా ఎనకడుగు వేయకుడదు. మిమ్మల్ని మీరు నమ్ముకుని పట్టుదలతో ముందుకు వెళ్తే లక్ అంతా మీ చుట్టే ఉందని జ్యోతిష్య నిపుణులు తెలిపారు.