ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశికి అత్యంత ప్రీతిపాత్రంగా పరిగణిస్తారు హిందువులు. ఎందుకంటే ఆ రోజున తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వ కాలంలో తొలి ఏకాదశినే సంవత్సరం ఆరంభంగా పరిగణించేవారని తెలుస్తోంది.
ఏదైనా పని చేసేటప్పడు వారం, వర్జ్యాలు చూడటం పరిపాటి. ఏదైనా కార్యం తలపెట్టే సమయంలో దశమి, ఏకాదశి, పౌర్ణమి వంటి వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశికి అత్యంత ప్రీతిపాత్రంగా పరిగణిస్తారు హిందువులు. ఎందుకంటే ఆ రోజున తొలి ఏకాదశిగా భావిస్తారు. పూర్వ కాలంలో తొలి ఏకాదశినే సంవత్సరం ఆరంభంగా పరిగణించేవారని తెలుస్తోంది. ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలూ పబ్బాలూ ఎక్కువ. అయితే ఈ పండుగలు మొదలయ్యేది తొలి ఏకాదశితోనే. లంఖణం పరమ ఔషధం అనే ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశి. ఇదే సమయంలో వానకాలం కాబట్టి.. రోగ నిరోధక శక్తి తగ్గిపోతున్న నేపథ్యంలో ఆహార నియమాలపై తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు కూడా ఈ పండుగ దోహదం చేస్తుందని సైంటిఫిక్ రీజన్.
ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. విష్ణు మూర్తి పవళించే రోజు కాబట్టి దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు. అలాగే దీన్ని పేలాల ప్రసాదంతో పూజిస్తారు కాబట్టి పేలాల పండుగ అని కూడా పిలుస్తారు. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మరుసటి అనగా ద్వాదశి ఉదయం తెల్లవారు జామున లేచి, స్నానమాచరించి, విష్ణుమూర్తిని కొలిచి, తీర్థప్రసాదాలను స్వీకరించి, భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాండని ఉవాచ. ఈ ఏకాదశిని పద్మఏకాదశిగా కూడా పిలుస్తారు. ఈ యోగ నిద్ర అనేది భూమి పై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచన. తద్వారా ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయి.
అలాగే ఈ రోజున భక్తి శ్రద్ధలతో శ్రీ మహా విష్ణువును పూజిస్తే.. ఇంట్లో ఉన్న దారిద్రం తొలగిపోయి.. కోటీశ్వరులు అవుతారట. హిందు సంప్రదాయం ప్రకారం.. రావి చెట్టును త్రిమూర్తులకు ప్రతిరూపంగా భావిస్తారు. శని ప్రభావం ఎక్కువ ఉన్నవారు రావి చెట్టును పూజిస్తే.. ఆయన అనుగ్రహం ఉంటుందని పండితులు చెబుతుంటారు. రావి చెట్టును పూజించడం వల్ల కష్ట నష్టాలను, బాధలు తొలగిపోతాయి. పురాణాల ప్రకారం.. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ చెట్టులో నివాసముంటారు. తొలి ఏకాదశి రోజున ఈ రావి చెట్టు చుట్టు ప్రదక్షిణలు చేసి, కాస్త నీళ్లు పోసి, దీపారాధన చేస్తే విష్ణువు కరుణ కటాక్షాలు ఉంటాయట. పాపాలు తొలగిపోతాయట. అలాగే రావి చెట్టును కొలిస్తే స్వయంగా మహా విష్ణువును ప్రసన్నించుకున్నట్లేనని పలు కథలు చెబుతున్నాయి.
అదే విధంగా తొలి ఏకాదశి నాడు.. ఓ మంచి రావి ఆకును తీసుకుని, దాన్ని శుభ్రం చేసి దానిపై శ్రీ అని రాసి.. పూజ గదిలో ఉన్న శ్రీ మహా విష్ణువు పాదాల చెంత ఆ రావి ఆకును ఉంచి భక్తి, శ్రద్ధలతో పూజిస్తే.. ఎన్నో బాధలు ఉన్నా తొలగిపోతాయట. దోషాలు, ఇతర సమస్యలు తీరిపోతాయట. ఓ సారి మహర్షికి ప్రత్యక్షమైన మహా విష్ణువు ‘నేను రావి చెట్టు రూపంలో భూలోకంలో కొలువై ఉంటాను. రావి చుట్టూ ప్రదిక్షణలు చేసి, తనను పూజిస్తారో వారికి సమస్త దోషాలు, గ్రహపీడలు తొలిగిపోయి.. అష్ట ఐశ్వర్యాలు సిద్దిస్తాయి. రావి చెట్టు మరణం ఉండదు.. ఎండి పోదు. చిర ఆయుష్సుతో జీవిస్తుంది. అలాగే రావి చెట్టును పూజించే తన భక్తులు సుఖ సంతోసాలు, అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు’ అని వరమిచ్చారట. ఏలిన నాటి శని, అర్థ అష్టమ శని.. శని ప్రభావం ఎక్కువ ఉన్న సమయంలో రావి చెట్టును పూజించడానికి కారణం ఇదే. దీనికి పూజిస్తే దీర్ఘ అయుస్సుతో పాటు శని ప్రభావం తొలగిపోయి.. ఆ ఇళ్లు సిరి సంపదలు, అష్ట ఐశ్వర్యాలతో కళకళలాడుతూ ఉంటుందట.