ఆషాడ మాసం శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా హిందువులు పండుగ చేసుకుంటారు. శ్రీ మహా విష్ణువు పాలకడలిపై యోగ నిద్రలోని వెళ్లే సందర్భంగా పరిగణిస్తూ తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు.
ఆషాడ మాసం శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశి పండుగగా హిందువులు జరుపుకుంటారు. శ్రీ మహా విష్ణువు పాలకడలిపై యోగ నిద్రలోని వెళ్లే సందర్భంగా పరిగణిస్తూ తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ పండుగను దేశ వ్యాప్తంగా హిందువులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. హిందూ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి. తొలిఏకాదశి నాడు భక్తులు ఉపవాసం ఉండి, ఆ రాత్రి జాగారం చేసి.. మరుసటి రోజు స్నానమాచరించి.. విష్ణుమూర్తిని పూజిస్తారు. ఇలా చేస్తే పాపాలు తొలగిపోయి.. సుఖ, సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతామని విశ్వసిస్తుంటారు.
శ్రీ మహా విష్ణువుకు ఇష్టమైన తిథి కూడా ఏకాదశి. ఆ రోజున విష్ణువుకు పూజిస్తే.. ఎంతో మేలు జరుగుతుందని భావిస్తుంటారు. అయితే ఈ రోజున ఓ అద్భుత దృశ్యం సాక్షాత్కరమైంది. ఆంధ్రప్రదేశ్లోని పుణ్య క్షేత్రాల్లో ఒకటైన మహానందిలోని రుద్ర గుండం కోనేరు వద్ద ఓ పెద్ద పాము దర్శనమిచ్చింది. కోనేరు వద్ద నాగుపామును గుర్తించిన ఆలయ సిబ్బంది గుర్తించి స్నేక్ క్యాచర్కు సమాచారం అందించారు. కాగా, శివాలయంలో నాగేంద్రుడు దర్శనమివ్వడంతో.. భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పరమశివుణ్ని దర్శించేందుకు నాగేంద్రుడు వచ్చాడంటూ మాట్లాడుకుంటున్నారు. దీంతో పండుగ రోజు సాక్షాత్తు పరమ శివుడు కటాక్షం దొరికిందని కొంత మంది భావిస్తున్నారు. ఈ విషయం తెలిసి.. భక్తులు ఆ దేవాలయానికి క్యూ కట్టారు. అంతలో వచ్చిన స్నేక్ క్యాచర్ నాగుపామును జాగ్రత్తగా పట్టుకుని అటవీప్రాంతంలో వదిలిపెట్టారు.