కొంతమంది ఎన్ని వేల కోట్లు ఆస్తి ఉన్నా చాలా సాధారణంగా ఉంటారు. ఆమె బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అత్తగారు. అయితేనేం చాలా సింపుల్ గా ఉంటారు. గుడిలో దేవుడికి స్వయంగా కట్టెల పొయ్యిపై ప్రసాదం వండి సమర్పించారు. మిగతా భక్తులలానే తాను కూడా సాధారణ భక్తురాలిగా గుడి బయట రోడ్డు మీద కూర్చుని పాయసం వండి నైవేద్యాన్ని సమర్పించి భక్తి చాటుకున్నారు.
కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో అట్టుకల్ భగవతి దేవాలయంలో పొంగల్ పండుగకు సంబంధించిన వేడుకలో వేలాది మంది మహిళలు తరలివెళ్లారు. ప్రతి ఏటా పది రోజుల పాటు జరిగే ఈ వేడుకలో వేలాది మంది మహిళా భక్తులు పాల్గొంటారు. ఈ క్రమంలో మార్చి 7వ తేదీన మంగళవారం జరిగిన పొంగల్ పండుగకు వేలాదిగా మహిళా భక్తులు తరలి వెళ్లారు. ఉదయం పదిన్నర గంటల సమయంలో వేలాది మంది మహిళలు అట్టుకల్ భగవతి ఆలయంలో కట్టెల పొయ్యిలు వెలిగించి పొంగల్ వంట ప్రారంభించారు. నగరమంతా రోడ్ల పైన, ఆలయం చుట్టూ పొయ్యిలను ఏర్పాటు చేస్తారు మహిళలు. పొయ్యి మీద లోహం లేదా మట్టి పాత్రను పెట్టి బియ్యం, బెల్లం, కొబ్బరి, యాలకులు వంటి వాటితో పాయసం తయారు చేస్తారు. అలా చేసిన ప్రసాదాన్ని దేవుడికి నైవేద్యంగా పెడతారు.
ఇలా మహిళలందరూ పెద్ద ఎత్తున ఒక చోట చేరి ఇలా ప్రసాదం వండడం అనేది దేశంలోనే అతిపెద్ద సమూహంగా చెబుతారు. ఇదిలా ఉంటే ఈ ప్రసిద్ధ పొంగల్ వేడుకలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అత్త గారు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి కూడా పాల్గొన్నారు. 35 వేల కోట్లకు ఆస్తిపరురాలైన సుధామూర్తి ఇలా ఒక సాధారణ గృహిణిలా భక్తిభావంతో వేడుకలో పాలు పంచుకున్నారు. తోటి మహిళలతో కలిసి ఇటుకలతో పొయ్యి ఏర్పాటు చేసి సాధారణ గృహిణిలా పాయసం వండి భగవంతునికి నైవేద్యం సమర్పించారు. ఒక చేతిలో గరిటె, మరో చేతిలో అరిటాకుతో ఉన్న అమ్మ ఫోటో నెటిజన్లను ఆకర్షిస్తోంది.
ఈ ఫోటోను భారతీయ జనతా పార్టీ సెంట్రల్ బెంగళూరు పార్లమెంట్ సభ్యులు పీసీ మోహన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా అది కాస్తా వైరల్ గా మారింది. ‘ఆమె 35 వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ నికర సంపన్న కుటుంబం నుంచి వచ్చింది. ఆమె అల్లుడు ఓ దేశానికి ప్రధానమంత్రి. ఆమె ఎన్నో ఘనతలు సాధించిన మహిళ. ఇలాంటి మహిళ భారతీయ సంప్రదాయంలో ముందు నిలిచారు. ఆమె పద్మభూషణ్ సుధామూర్తి’ అంటూ ట్వీట్ చేశారు. మరి వేల కోట్లకు అధిపతి అయినటువంటి సుధామూర్తి ఇలా సాధారణ గృహిణిలా కనిపించడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
She comes from a wealthy family with a net worth exceeding ₹35,000,00,00,000 and her son-in-law happens to be the UK PM.
She is a highly accomplished woman.
She remains down-to-earth and committed to preserving Indian tradition.
She is Padma Bhushan Sudha Murthy. pic.twitter.com/QN4wwFuQok
— P C Mohan (@PCMohanMP) March 9, 2023