ఒడిశా పెను విషాదాన్ని కూడా కొందరు నాయకులు తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారు. దీంతో లీడర్స్ అంటే ఇలా కూడా ఉంటారా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
ఒడిశా రైలు ప్రమాదం జరిగి దాదాపుగా వారం కావొస్తోంది. మూడు రైళ్లు ఢీకొన్న ఈ ఘటనలో మృతుల సంఖ్య 275 వరకు ఉండగా.. 1,100 మందికి పైగా గాయపడ్డారు. బాలాసోర్కు సమీపంలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో గాయపడిన వారిలో చాలా మంది డిశ్చార్జ్ అయి వెళ్లిపోయారని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఈ ఘటనలో ఇంకా 187 మృత దేహాలను గుర్తించాల్సి ఉందని అధికారులు అంటున్నారు. దీంతో అనేక కుటుంబాలు తమ ఆప్తుల ఆచూకీ తెలియక తల్లడిల్లుతున్నారు. ఇది సాంకేతిక లోపమా లేదా పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన విద్రోహ చర్యా అనేది ఇంకా తేలలేదు. ఒడిశా విషాదంపై రైల్వే ఉన్నతాధికారుల విచారణ పూర్తయింది. కానీ సీబీఐ ఇన్వెస్టిగేషన్ పూర్తయితే గానీ ఈ యాక్సిడెంట్కు అసలు కారకులు ఎవరు? ఎందుకిలా చేశారనేది బయటపడుతుంది.
బాధ్యులు ఎవరో తేలితే వారిపై రైల్వే శాఖ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి. ఇంటర్లాకింగ్ వ్యవస్థలో ఎవరో కావాలనే మార్పులు చేశారని రైల్వే అధికారులు అంటున్నారు. అలాంటప్పుడు ఈ లోపాన్ని ముందే గుర్తించి మొన్న ఫిబ్రవరిలో నైరుతి రైల్వే జోన్ చీఫ్ ఆపరేటింగ్ మేనేజర్ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా తీసుకున్న చర్యలేమిలో అధికారులు వెల్లడించాల్సి ఉంది. ఈ ఘటనలో రైల్వే అధికారులదే తప్పు అని సోషల్ మీడియాలో నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రైల్వే శాఖ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా.. ఒడిశా విషాద బాధితులను నాయకులు తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారని సమాచారం.
బాధితులకు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే ఒక మంత్రి బాధిత కుటుంబాలకు రూ.2 వేల నోట్లతో పరిహారాన్ని అందిస్తున్నారని బెంగాల్ బీజేపీ ప్రెసిడెంట్ సుకాంత మజుందార్ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు బాధితులు తీసుకున్న పరిహారాన్ని చూపిస్తున్న ఒక వీడియోను ఆయన నెట్టింట షేర్ చేశారు. అధికార నేతలు బాధితులను వాడుకుంటున్నారని.. రూ.2 వేల నోట్లను ఇవ్వడం ద్వారా తమ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకుంటున్నారని మజుందార్ ఆరోపించారు. రైలు ప్రమాద బాధితులకు రూ.2 వేల నోట్లు ఇస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాధితులను కూడా వదలరా అంటూ నేతలపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ అంశంపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
মমতা বন্দ্যোপাধ্যায়ের নির্দেশে তৃণমূল দলের পক্ষ থেকে নিহতদের পরিবারকে 2 লক্ষ টাকার আর্থিক সাহায্য করছেন রাজ্যের একজন মন্ত্রী। সাধুবাদ জানাই। কিন্তু এপ্রসঙ্গে এই প্রশ্নটাও রাখছি, একসাথে 2000 টাকার নোটে 2 লক্ষ টাকার বান্ডিলের উৎস কি? pic.twitter.com/TlisMituGG
— Dr. Sukanta Majumdar (@DrSukantaBJP) June 6, 2023