మారుతున్న కాలంతో పాటు మనుషుల తీరు కూడా మారుతోంది. ఒకప్పుడు అక్రమసంబంధాలు, అడ్డగోలు వ్యవహారలు నడిపే వారు సమాజానికి భయపడేవారు. బయటకు తెలిస్తే పరువు పోతుందని జడిసేవారు. ఒకవేళ తెలిసినా.. మగాడు తిరిగితే తప్పేంటి అనుకునేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు పరిస్థితులు కూడా మారుతున్నాయి. గతంలో భర్త కోసం ఇద్దరు భార్యలు పొట్లాడుకునేవారు. ఇప్పుడు భార్య.. కోసం ఇద్దరు భర్తలు పోట్లాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అక్రమ సంబంధాలు నడపడం.. అందుకోస అవసరమైతే కట్టుకున్నవాడు, కన్నవారి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు కొందరు మహిళలు. ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల గురించి కూడా ఆలోచించడం లేదు. అందరిని వదిలేసి.. ప్రియుడితో వెళ్లిపోతున్నారు.
తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి మహారాష్ట్రలో చోటు చేసుకుంది. తమ భార్య మూడో వ్యక్తితో వెళ్లిపోయిందని.. ఆమె ఇద్దరు భర్తలు పోలీసులను ఆశ్రయించారు. మహారాష్ట్రలోని సోనేగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సొంతూరు వెళ్లొస్తానని చెప్పిన మహిళ.. కొద్ది రోజుల క్రితం రెండో భర్త ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తితో ఆమె ప్రేమలో పడిందని తెలుస్తోంది. కానీ అతడి గురించిన వివరాలేవీ పోలీసులకు పెద్దగా తెలియరాలేదు.
ఇది కూడా చదవండి: Children: వైద్యుల నిర్లక్ష్యం.. నలుగురు చిన్నారులకు HIV.. ఓ చిన్నారి మృతి
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఆ మహిళ మొదటి భర్తను ప్రేమించి పెళ్లాడింది. నాలుగేళ్లపాటు అతడితో కాపురం చేసి ఇద్దరు పిల్లల్ని కూడా కన్నది. ఓ రోజు ఆమె ఫోన్కు గుర్తు తెలియని నంబర్ నుంచి మిస్డ్ కాల్ వచ్చింది. అలా మరో వ్యక్తి ఆమె జీవితంలోకి ప్రవేశించాడు. అతడితో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. మొదటి భర్త, ఇద్దరు పిల్లల్ని వదిలేసి.. ప్రియుడితో కలిసి పారిపోయింది. దీంతో భార్య చేసిన పనిని తట్టుకోలేక మొదటి భర్త తాగుడుకు బానిస కాగా.. ఆమె మాత్రం రెండేళ్ల క్రితం నాగపూర్ శివార్లలోని గుళ్లో ప్రియుణ్ని పెళ్లి చేసుకుంది. దీంతో ప్రియుడు కాస్తా రెండో భర్తగా మారాడు. వారిద్దరు కలిసి నివసిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Identical Twins: వారిద్దరూ కవలలు. తమ్ముడి భార్యపై కన్నేసిన అన్న! ఏకంగా 6 నెలలు!
మొదటి భర్త తాపీ పని చేసే వ్యక్తి కాగా.. రెండో వ్యక్తి ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు వేసే పని చేసేవాడు. రెండేళ్లపాటు రెండో భర్తతో కలిసి జీవించిన సదరు మహిళ.. ఇటీవలే మూడో వ్యక్తితో కలిసి పరారైంది. దీంతో ఆమె కోసం వెతికే క్రమంలో రెండో భర్త ఆమె మొదటి భర్త దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పాడు. మొదటి భర్త, రెండో భర్త కలిసి భరోసా కేంద్రాన్ని ఆశ్రయించారు. చిన్నారులు, మహిళలు, పెద్ద వయసు వారికి సాయం చేయడం, కౌన్సెలింగ్ ఇవ్వడం కోసం మహారాష్ట్రలో భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మూడో వ్యక్తితో వెళ్లిపోయిన తన భార్యను వెనక్కి తీసుకొచ్చేందుకు మొదటి భర్త సుముఖంగా లేడు కానీ.. రెండో భర్త మాత్రం ఆమెతో మళ్లీ జీవితం కొనసాగించడానికి ఆసక్తి చూపుతున్నాడని భరోసా కేంద్రం ఇంఛార్జ్, సీనియర్ ఇన్స్పెక్టర్ సీమా సర్వీ తెలిపారు. ‘భరోసా కేంద్రం ఫిర్యాదు నమోదు చేసుకోలేదు గానీ.. వారిద్దర్నీ మూడో ప్రియుడితో ఆ మహిళ వెళ్లిపోయిన విషయాన్ని సోనేగావ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయమని సూచించాం. ఇందులో ఎలాంటి గృహ హింసకు తావు లేదు కాబట్టి స్థానిక పోలీసు స్టేషన్ ఈ కేసును మెరుగ్గా డీల్ చేస్తుంది’ అని సీమా తెలిపారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Maharashtra: పిల్లి పిల్ల అనుకొని ఈ చిన్నారి ఇంటికి ఏం తెచ్చిందో చూస్తే బైండ్ బ్లాక్!