‘నీ మీద ఒట్టు.. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేకుండా నేను బతకలేను. నిన్ను తప్ప మరో అమ్మాయిని కన్నెత్తి చూడలేదు. నా మనస్సులో నీకు తప్ప ఆడ దేవతకు కూడా స్థానం లేదు. ఏదీ ఏమైనా నేను నిన్నే పెళ్లి చేసుకుంటా’అని ప్రియురాలి తలపై ఒట్టేసి మరీ హామీలు గుప్పించాడు ప్రేమికుడు.
‘నీ మీద ఒట్టు.. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేకుండా నేను బతకలేను. నిన్ను తప్ప మరో అమ్మాయిని కన్నెత్తి చూడలేదు. నా మనస్సులో నీకు తప్ప ఆడ దేవతకు కూడా స్థానం లేదు. ఏదీ ఏమైనా నేను నిన్నే పెళ్లి చేసుకుంటా’అని ప్రియురాలి తలపై ఒట్టేసి మరీ హామీలు గుప్పించాడు ప్రేమికుడు. అతడి మాయమాటలు నమ్మి సర్వస్వం అప్పగించింది యువతి. కానీ చివరకు వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. ఆమెకు మరో యువకుడితో పెళ్లి కూడా చేసేశారు. అయితే నువ్వు లేకపోతే నేను జీవించలేనంటూ పెళ్లైన ప్రియురాలి వెంట పడసాగాడు. అతని మాటలు నిజమని నమ్మిన మహిళ.. భర్తకు విడాకులు కూడా ఇచ్చేసింది. చివరకు ప్రేమించిన యువకుడు.. మొహం చాటేయడంతో ఆమె పోరాటానికి దిగింది.
వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన చిప్పకుర్తి రజిత, జనగామ విద్యాసాగర్ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ విషయం తెలిసి.. ఆమెకు 2008లో వేరే యువకుడితో పెళ్లి చేశారు పెద్దలు. అయితే పెళ్లైనా కూడా ఆమె వెంట పడటం ఆపలేదు విద్యా సాగర్. నువ్వు లేకుండా జీవించలేనని, చనిపోతానంటూ అనడంతో.. పెళ్లైన మూడు నెలలకే పుట్టింటికి వచ్చేసింది రజిత. ఈ క్రమంలో భర్తతో విడాకులు కూడా తీసుకుంది. అప్పటి నుండి విద్యాసాగర్, రజిత ప్రేమ పక్షుల్లా తిరగసాగారు. అయితే పెళ్లి చేసుకోమనేసరికి మొహం చాటేస్తూ వస్తున్నాడు విద్యాసాగర్. చివరకు తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆదివారం అతడి ఇంటి ముందు బైఠాయించింది రజిత. తనకు న్యాయం చేయాలంటూ రజిత 100కు ఫోన్చేసింది. పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను సముదాయించారు. అనంతరం సర్పంచ్ శ్రీనివాస్, కుటుంబ సభ్యులతో కలిసి రజిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.