వెస్టిండీస్ తో టీ 20 సిరీస్ కి విశ్రాంతి తీసుకున్న కోహ్లీ ప్రస్తుతం ఎంజాయ్ చేసే పనిలో ఉన్నాడు. తాజాగా ఒక కొత్త ఇంటిని నిర్మిస్తూ హాట్ టాపిక్ గా మారాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎంత రిచెస్ట్ క్రికెటరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఛేజింగ్ కింగ్ గా, ఎన్నో రికార్డ్స్ తన పేరు మీద లిఖించుకున్న కోహ్లీ క్రికెట్ లో చెరగని ముద్ర వేసాడు. విరాట్ ఆటలో ఎంత నాణ్యత ఉంటుందో లైఫ్ లో కూడా అంతే రాయల్ గా ఉండేలా చూసుకుంటాడు. ఫిట్ నెస్, డైట్, ఫాలోయింగ్, రికార్డ్స్ ఇవన్నీ కోహ్లీ గురించి తెలిసినా.. ఈ స్టార్ క్రికెటర్ ఇల్లు ఎలా ఉంటుందో ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. అయితే తాజాగా కోహ్లీ కొత్త ఇల్లు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 ఎకరాల్లో ఇంటిని నిర్మించుకోనున్నాడు. ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఇటీవలే వెస్టిండీస్ తో టెస్టు సిరీస్ ఆడిన కోహ్లీ వన్డే సిరీస్ లో ఆడే అవకాశం రాలేదు. కుర్రాళ్లను పరీక్షించాలనే ఉద్దేశ్యంలో విరాట్ కి టీ 20 సిరీస్ లో విశ్రాంతి లభించింది. దీంతో కింగ్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో విరుష్క దంపతుల న్యూ హౌజ్ ఏకంగా 8 ఎకరాల్లో ఉండబోతోందట.గతేడాది మహారాష్ట్రలోని అలీబాగ్ ప్రాంతంలో 8 ఎకరాల ల్యాండ్ ను కొనుగోలు చేశారు. 19.24 కోట్లతో ఈ భూమిని కొనుగోలు చేశారు. తీరప్రాంతంలోని ఈ విశాలమైన ల్యాండ్ లో కొత్తింటి నిర్మాణం మెుదలుపెట్టారు ఈ దంపతులు. 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఇంటి నిర్మాణం చేపట్టారు. ప్రముఖ ఆర్కిటెక్ మజుందార్ బ్రావో ఈ ఇంటి నిర్మాణాన్ని డిజైన్ చేశాడు. అన్ని అనుమతులను పూర్తి చేసుకుని ఈ ఇంటి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ ఇల్లు పూర్తి అయ్యే సరికి ఇంకో రెండు సంవత్సరాలు పట్టొచ్చని తెలుస్తోంది. మరి కోహ్లీ నిర్మించబోతున్న ఈ ఇల్లు మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
Virat Kohli and Anushka Sharma in Alibaug to begin construction of their new house on 8 acres of land. pic.twitter.com/5CVNtz5vcv
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 14, 2023