అభిమాన నేతలు, హీరోలు, క్రికెటర్లు కనబడగానే ఫోటోలు దిగాలని, వారి నుండి ఆటోగ్రాఫ్ తీసుకోవాలని, వారితో కరచాలనం చేయాలని ఆశపడుతూ ఉంటారు. ఇక వారు తమ ఊరు వస్తున్నారంటే చాలు హడావుడి చేస్తుంటారు అభిమానులు. తమ అభిమానాన్ని పలు రకాలుగా చూపిస్తారు. వారికి ఘన స్వాగతం పలికడం దగ్గర నుండి తిరిగి వెళ్లే వరకు అన్ని మర్యాదలు చేస్తారు. అటువంటి అరుదైన ఘన స్వాగతాన్ని పొందారు ప్రియాంక గాంధీ
రాజకీయ నేతలు, సినిమాలు, క్రికెటర్లకు అభిమానులు ఎక్కువగా ఉంటారు. తమ అభిమాన నేత కనబడగానే ఫోటోలు దిగాలని, వారి నుండి ఆటోగ్రాఫ్ తీసుకోవాలని, వారితో కరచాలనం చేయాలని ఆశపడుతూ ఉంటారు. రాజకీయ ప్రముఖులు కానీ, క్రికెటర్లు, సినిమా హీరోలు, హీరోయిన్లు తమ ఊరు వస్తున్నారంటే చాలు హడావుడి చేస్తుంటారు అభిమానులు. దారి పొడవునా ఫ్లకార్డు ఏర్పాటు చేయడం లేదా, పార్టీ జెండాలు కట్టడం, ర్యాలీలు, బైక్ యాత్రలు చేస్తూ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటాం. అటువంటి అరుదైన అభిమానాన్ని సొంతం చేసుకున్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. 85వ జాతీయ కాంగ్రెస్ సదస్సులో ఈ అద్భుతం అవిష్కృతమైంది.
ఛత్తీస్గఢ్లోని నవ రాయ్పూర్ నగరంలో జరుగుతున్న కాంగ్రెస్ 85వ జాతీయ సదస్సులో పాల్గొనేందుకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ శనివారం ఉదయం స్వామి వివేకానంద విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెకు ముఖ్యమంత్రి భూపేష్ భగేల్, చత్తీస్ గఢ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మెహన్ మార్కం, ఇతర ముఖ్య నేతలు స్వాగతం పలికారు. ఆమె రాక నిమిత్తం ఘన స్వాగతం పలికేందుకు ప్రియాంక అభిమానులు, కార్యకర్తలు విమానాశ్రయం నుండి దాదాపు రెండు కిలో మీటర్ల వరకు గులాబీ రేకులతో కార్పెట్ను సిద్ధం చేశారు. జానపద కళాకారులు.. రంగురంగుల సాంప్రదాయ దుస్తులు ధరించి దారి పొడవునా ఆమెకు ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలు జెండాలను ప్రదర్శించారు.
ఈ సదస్సు మూడు రోజుల పాటు జరుగుతుండగా.. రెండో రోజు ప్రియాంక ఇక్కడకు వచ్చారు. ప్రియాంక గాంధీకి స్వాగతం పలికేందుకు దాదాపు ఆరు టన్నుల గులాబీలను వినియోగించారు. రెండు కిలోమీటర్ల మేర పూల బాట పరిచారు. అంతే కాకుండా దారి పొడవునా ఆమెపై పూల వర్షాన్ని కురిపించారు. ఆమె పట్ల అభిమానాన్ని ఈ రూపంలో ప్రదర్శించారు కాంగ్రెస్ నేతలు, మద్దతుదారులు, కార్యకర్తలు ప్రదర్శించారు. కాగా, ఈ ఘన స్వాగతం పట్ల ప్రియాంక గాంధీ కూడా ఎంతో సంతోషించారు. ఆమె కూడా కరచాలనం చేస్తూ, అందరికీ అభివాదం చేస్తూ కారులో పయనించారు. ఆమె వెంట చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ కూడా ఉన్నారు. అయితే ఈ సదస్సులో పాల్గొన్న కాంగ్రెస్ ప్రస్తుత అధ్యక్షురాలు సోనియాగాంధీ.. రాజకీయ జీవితానికి స్వస్థి పలికారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
#WATCH | Chhattisgarh: Flower petals were laid on the streets to welcome Congress general secretary Priyanka Gandhi Vadra and other Congress leaders in Raipur for the 85th Plenary Session of the party. pic.twitter.com/Z4hozwKDl8
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) February 25, 2023