పలు రాష్ట్రాల్లో రాజకీయనేతలపై రాళ్లు, చెప్పుల దాడులు జరుగుతున్నాయి. ఇలాంటాి దాడులు కొన్నిసార్లు ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు కావొచ్చు.. సామన్యుల నుంచి కూడా వ్యతిరేకత వల్ల దాడులు జరగిన సందర్బాలు ఉన్నాయి.
ఇటీవల దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రాజకీయనేతలపై రాళ్లు, చెప్పుల దాడులు జరుగుతున్నాయి. ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు కావొచ్చు.. పాలకుల వల్ల నష్టపోయిన వారు కావొచ్చు ఇలాంటి ఘటనల వల్ల తీవ్ర ఉత్రిక్తత నెలకొంటుంది. తాజాగా కేంద్ర మంత్రి నిశిత్ ప్రమాణిక్ కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. ఆయన పర్యటనను అడ్డుకున్న తృణముల్ కార్యకర్తలు రాళ్లదాడికి తెగబడ్డారు. దీంతో ఆ ప్రాంతం అంతా తీవ్ర ఉద్రిక్తత పరిస్తితి నెలకొంది. వివరాల్లోకి వెళితే..
పశ్చిమబెంగాల్లోని కూచ్ బెహార్ పర్యటనకు నిమిత్తం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రమాణిక్ వెళ్లారు. ఆయన పర్యలనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తృణముల్ కార్యకర్తలు మంత్రి కాన్వాయ్ కి అడ్డు వచ్చారు. నల్లజెండా తో నిరసన తెలిపారు.. రాళ్లతో దాడి చేసి కారు అద్దాలు పగులగొట్టారు. పోలీసులు వెంటనే అలర్ట్ అయి ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ వారు తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. ఈ దాడిపై మంత్రి నిశిత్ ప్రమాణిక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కేంద్ర మంత్రి పర్యటనకు వస్తే ఈ విథంగా హింసకు పాల్పడతారా ? ఇక్కడ హింసకు పాల్పపడినవారికి రక్షణ కల్పిస్తున్నారు అంటూ ఆరోపించారు. పశ్చిమబెంగాల్ లో ప్రజాస్వామ్యం ఎంతటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉందో ఈ ఘటన వల్ల తెలుస్తుందని అన్నారు.
పశ్చిమబెంగాల్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రిపై రాళ్లదాడి జరగడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన పై పశ్చిమబెంగాల్ బీజేపీ అధికార ప్రతినిధి షమిక్ భట్టాచార్య మాట్లాడుతూ.. ఇది ఎంతో దారుణమైన విషయం అని.. కేంద్ర మంత్రిపై రాళ్లదాడి జరగడం ఎంతో దారుణం.. ఒక కేంద్రమంత్రికే ఇలా జరిగితే.. సామాన్య ప్రజల భద్రత గురించి ఆలోచించండి.. అర్జంట్ గా రాష్ట్రంలో ఆర్టికల్ 355 విధించేందుకు గవర్నర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు బీజేపీ స్థానిక కార్యాలయానికి వెళ్తుండగా మార్గమద్యలో ఈ దాడి జరిగిందిన పోలీసులు అంటున్నారు. అయితే ఇటీవల బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సైనికుల్ల కాల్పుల్లో ఓ గిరిజనుడు చనిపోగా.. తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలు కేంద్ర మంత్రి కాన్వాయ్ ని అడ్డుకొని నిరసన తెలిపారని టీఎంసీ నాయకులు చెబుతున్నారు.
Union minister Nisith Pramanik’s car has been attacked in West Bengal
The attackers were none other than TMC goons
Now imagine the condition of common people in Mamata’s state pic.twitter.com/uxSDtK3Rq4
— Mahesh Vikram Hegde 🇮🇳 (@mvmeet) February 25, 2023