ప్రస్తుతం దేశంలో ఏది కొనాలన్నా సామాన్యులు భయపడే పరిస్థితి నెలకొంది. నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి.. మరోవైపు ఖర్చులు ఎక్కువ కావడంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాల పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
ప్రస్తుతం మార్కెట్ లో వెళ్లి ఏదైనా కొనాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించి మరీ కొనే పరిస్థితి ఏర్పడింది. రోజు రోజుకీ నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. వంటింట్లో వాడే వంటనూనెలు, బియ్యం, కూర గాయలు, పప్పు దినుసులు, డైరీ, పాలు, పౌల్ట్రి, చికెన్, మటన్, పండ్లు, సర్వీసులు టాక్స్ అమాంతం పెరిగిపోయాయి. దీనికి తోడు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు సైతం కొండెక్కి కూర్చున్నాయి. ఆదాయం తక్కువ.. ఖర్చులు ఎక్కువ కావడంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాల పై ప్రభావం భారీగా చూపిస్తుంది. ఇలాంటి సమయంలో సామాన్యులకు శువార్త.. త్వరలో పాల ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. వివరాల్లోకి వెళితే..
కేంద్రమంత్రి పురుషోత్తం రుపాలా మాట్లాడుతూ.. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు పంటలను దెబ్బతీస్తున్నప్పటికీ.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రసత్తుం దేశ వ్యాప్తంగా దాణా కొరత ఎక్కడా లేదు. రాష్ట్రాలకు తగినంత స్టాక్ ఉంది. ప్రస్తుతం పరిస్థితుల్లో సరఫరా ఖాళీని పూరించాలని ఆయన కోరారు. ఇక పాల ఉత్పాదకతను మరింత మెరుగు పర్చడానికి.. వాతావరణ పరిస్థితులను తట్టుకునేందుకు జాతులపై ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. భారత దేశంలో పాల ధరలు గత మూడేళ్లలో దాదాపు 22 శాతం వరకు పెరిగిపోయాయి. గత ఏడాదే పది శాతం పెరిగింది. పచ్చిమేత ధరలు తగ్గుముఖం పట్టాయి.. ఈ కారణంగా వర్షాకాలం తర్వాత పాల ధరలు తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుందని అన్నారు.
పెరుతుగున్న పాల ధరల ఎప్పుడు తగ్గుతాయన్న ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇస్తూ.. ప్రస్తుతం దేశంలో పాల కొనుగోలు, విక్రయాల ధరలను పశు సంవర్ధక, పాడిపరిశ్రమల శాఖ నియంత్రించడం లేదు.. సహకార, ప్రైవేట్ డెయిరీలు ఉత్పత్తి వ్యయాన్ని, మార్కెట్ పరిస్థితులను బట్టి ధరలను నిర్ణయిస్తున్నారు. పాలు ఎక్కవగా నిల్వ ఉండేది కాదు.. త్వరగా పాడైపోతాయి. ఇక నాసి రకం వస్తువుల ధరల్లో ఎప్పటికీ హెచ్చుతగ్గులు ఉండటం సహజం అని అన్నారు. సహకార విలీనం తర్వాత, ధరలను స్థిరీకరించడంలో మేము విజయం సాధించాము. ఇక దేశంలో అమూల్ మోడల్ కారణంగా వినియోగదారులు చెల్లిస్తున్న దానిలో దాదాపు డెబ్బై ఐదు శాతం నేరుగా ఉత్పత్తిదారుల జెబుకు నేరుగా వెళ్తుంది. అయితే రైతులకు వారి ఉత్పత్తి ఖర్చులను ఎలా సహాయం చేయాలన్న విషయాన్ని పరిశీలిస్తున్నట్లుగా రుపాలా అన్నారు.