ఈ మద్య కాలంలో వరుసగా విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. టేకాఫ్ అయిన కొద్ది సమయంలోనే ఇంజన్ లో లోపాలు తలెత్తడం, పక్షులు ఢీ కొట్టడం, ప్రకృతి అనుకూలించక అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ మద్య నేలపైనే కాదు ఆకాశం, సముద్ర మార్గంలో కూడా ప్రమాదాల సంఖ్య పెరిగిపోతూ ఉన్నాయి. మొన్న ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో జరిగిన రైళ్ల ప్రమాదం యావత్ దేశాన్ని ఒక్కసారే ఉలిక్కిపడేలా చేసి తీవ్ర విషాదాన్ని నింపింది. ఇటీవల పలు దేశాల్లో విమాన, హెలికాప్టర్ ప్రమాదాలు కూడా బాగా పెరిగిపోయాయి. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే సాంకేతిక లోపాలు, ఇతర కారణాల వల్ల ప్రమాదాలకు గురి అవుతున్నాయి. తాజాగా కేంద్రమంత్రి ప్రయాణిస్తున్న విమానానికి ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే..
ఈ మద్య కాలంలో వరుసగా విమనా ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రయాణికుల్లో ఆందోళన పెరిగిపోతుంది. తాజాగా కేంద్రమంత్రి రామేశ్వర్ తెలీ ప్రయాణిస్తున్న విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ విమానంలో మంత్రితోపాటు 150 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఇంజన్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అసాం లోని గుహవాటి విమానాశ్రయంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేశారు పైలెట్లు. ఈ ఘటనను గురించి గువహాటి ఎయిర్ పోరట్ వర్గాలు ధ్రువీకరించారు. ఆదివారం ఉదయం 8.40 నిమిషాలకు అసోంలోని గువహాటీ విమానాశ్రయం నుంచి డిబ్రుగఢ్ కి విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన 20 నిమిషాల్లోనే తిరిగి వెనక్కి వచ్చింది. అయితే టేకాఫ్ అయిన తర్వాత ఇంజన్ లో ప్రాబ్లమ్ ఉన్నట్లు పైటెల్స్ గమనించడంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండిగ్ చేయాల్సి వచ్చిందని అధికారు తెలిపారు.
ఈ విషయంపై కేంద్రమంత్రి రామేశ్వర్ తెలీ మాట్లాడుతూ.. ‘ఈ రోజు నాకు మంచిరోజు.. నాతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రశాంత్, తెరస్ గోవల్లాతో కలిసి విమానంలో బయలుదేరాను.. టింగ్ ఖాంగ్, దులియాజన్, టిన్సూకియాలో మూడు సమావేశాల్లో పాల్గొనాలి.. మా విమానం గాల్లోకి వెగిరిన కొద్దిసేపటికే గువహాటి ఎయిర్ పోర్టు లో ఎమర్జేన్సీ ల్యాండ్ అయిందని తెలిపారు.. మేం అంతా సురక్షితంగానే ఉన్నాం’ అని అన్నారు. కాగా, దిబ్రూగఢ్ వెల్లవలసిన ఇండిగో విమానం అత్యవసరంగా దిగిందని గువహాటీ ఎయిర్ పోర్టు వర్గాలు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు అంతా క్షేమంగా ఉన్నారని.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
A Dibrugarh-bound IndiGo flight was diverted to Guwahati’s Lokpriya Gopinath Bordoloi International after the pilot of the plane announced snag in engine of the aircraft. Over 150 passengers were travelling on the flight, including Union Minister of State for Petroleum and… pic.twitter.com/umZb0sm75V
— ANI (@ANI) June 4, 2023